Kartika Pournami: భక్త జనసంద్రంగా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్
ABN, Publish Date - Nov 05 , 2025 | 09:44 AM
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఏపీలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచారించి శివయ్యను దర్శించుకుంటున్నారు. అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో దీపాలను వదులుతున్నారు. అలాగే శివుని ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు.
నదీ స్నానాలు చేసి శివయ్యను స్మరించుకుంటున్నారు.
ఆ మహాదేవుని నామస్మరణతో శివాలయాలు మార్మోగుతున్నాయి.
ఆలయాల్లో ప్రత్యేక పూజులు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ భక్తులతో కిటకిటలాడుతోంది. నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు
మహిళలు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదిలోకి వదులుతున్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు నదీ పూజలు చేస్తున్నారు.
కార్తీక పౌర్ణమి నాడు నదిలో స్నానాలు చేస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.
నదీ స్నానం అనంతరం శివాలయాలకు చేరుకుని ఈశ్వరుడిని దర్శించుకుంటున్నారు.
Updated Date - Nov 05 , 2025 | 09:44 AM