Home » East Godavari
అనపర్తిలో తెలుగుదేశం పార్టీ ఉనికిని ప్రమాదంలో పడేసింది మీరేనని.. ఇప్పుడు అక్కడ పార్టీని కాపాడుకోవాల్సింది కూడా మీరేంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎదుట ఆ నియోజకవర్గ ఇన్చార్జీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది.
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు మరో అవమానం జరిగింది. ఈనెల 14న (గురువారం) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఆరోజు 10 వేల కార్లు..జనాలు తనవెంట రావాలని ఇటీవల ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్లు జరుగుతూనే ఉన్నాయి. ఇలాగే టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు వైసీపీకి వచ్చారు. ఆయన రాకతో రాజోలు నియోజకవర్గ వైసీపీలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన గొల్లపల్లి సూర్యారావును సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో రాపాక అనుచరులు వైసీపీకి గుడ్బై చెప్పేస్తున్నారు.
విశాఖ: నగరంలో యువకుడి కిడ్నాప్ వ్యవహారం చివరికు విషాదంగా ముగిసింది. వెడ్డింగ్ షూట్ నిమిత్తం తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లిన ఫోటోగ్రాఫర్ సాయి పవన్ కల్యాణ్ హత్యకు గురయ్యాడు. ఈనెల 26న వెడ్డింగ్ షూట్ ఉందని పవన్కు కొందరు వ్యక్తులు మెసేజ్ చేశారు.
Andhrapradesh: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డితో బహిరంగ చర్చకు వెళ్ళకుండా రామవరంలో రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయనను కొవ్వూరుకు తీసుకళ్లారు. అయితే రామకృష్ణారెడ్డిని విడుదల చేయాలంటూ కొవ్వూరు జాతీయ రహదారిపై టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు.
తూర్పుగోదావరి: బహిరంగ చర్చ కోసం శుక్రవారం ఉదయం 11 గంటలకు వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇంటికి వెళతానని, ఎమ్మెల్యే అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతానని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
అనపర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బహిరంగ చర్చకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఉదయం 11 గంటలకు వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి వస్తానని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇంటికి వస్తే శరీరంలోని పార్టులు తీసేస్తానంటూ వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు.
తూర్పుగోదావరి జిల్లా: అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చోటు చేసుకున్నాయి. సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై బహిరంగ లేఖతో ఈనెల 19 న ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి..
Andhrapradesh: స్వగ్రామాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటును ఎదుర్కోక తప్పడం లేదు. జిల్లాలోని రావులపాలెం మండలం గోపాలపురంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్వగ్రామంలోనే దళితులు ఎదురుతిరిగారు. గోపాలపురం సిద్దార్థ్ నగర్లోని ప్రభుత్వ పాఠశాలకు ఎమ్మెల్యే తండ్రి పేరు పెట్టడాన్ని దళితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి.
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ఒరిస్సాకు చెందిన ఆర్టీసీ బస్సు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఒరిస్సాలోని సబరంగాపూర్ నుంచి విజయవాడకు బస్సు వెళుతోంది. టైరు పంక్చర్ అయి బస్సు అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టింది.