Nirmala Sitharaman: తిరుమలలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ఘన స్వాగతం
ABN, Publish Date - Sep 11 , 2025 | 07:13 PM
తిరుపతిలో మూడు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో పర్యటించనున్నారు. అందుకోసం గురువారం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
అలాగే తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ టీటీడీ బోర్డు మెంబర్, బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి, టీటీడీ ఎస్వీవో మురళీ కృష్ణా తదితరలు ఆమెకు స్వాగతం పలికారు.
అనంతరం రేణుగుంట విమానాశ్రయం నుంచి నేరుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి ఘనంగా స్వాగతం పలికారు.
మరోవైపు టీటీడీ ఈవోగా నూతన ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన సైతం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు కలుస్తారని తెలుస్తుంది.
శుక్రవారం ఉదయం ఆనంద నిలయంలో కొలువు తీరిన ఆ దేవదేవుడు శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకోనున్నారు. అందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం తిరమల, తిరుపతిలో వివిధ కార్యక్రమాల్లో ఆమె పాల్గొనున్నారు.
Updated Date - Sep 11 , 2025 | 07:16 PM