Sharan Navaratri Mahotsavam On Indrakiladri: శరన్నవరాత్రి మహోత్సవాలు.. శ్రీదుర్గాదేవిని దర్శించేందుకు పోటెత్తిన భక్తులు..
ABN, Publish Date - Sep 30 , 2025 | 09:42 PM
ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి దేవాలయంలో కొలువు తీరిన దుర్గమ్మ మంగళవారం శ్రీదుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా ఇంద్రకీలాద్రికి పోటెత్తారు.
ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వారి దేవాలయంలో కొలువు తీరిన దుర్గమ్మ మంగళవారం శ్రీదుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా ఇంద్రకీలాద్రికి పోటెత్తారు.
అలాగే నవరాత్రుల్లో అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు.
దీంతో లక్షలాది మంది అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తున్నారు.
ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. వీటిలో చిన్నారులు, యువతులు పాల్గొంటున్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు.. అంటే సామూహిక కుంకుమార్చన సైతం నిర్వహిస్తున్నారు. వీటిలో భారీగా భక్తులు పాల్గొంటున్నారు.
దేవాలయంలో వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు.
మంగళవారం రాత్రి దుర్గమ్మ వారిని ఇంద్రకీలాద్రిపై ఊరేగించారు.
భక్తులు భారీగా తరలి వస్తుండడంతో.. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
మరో వైపు అమ్మవారి జన్మ నక్షత్రం వేళ.. సరస్వతి దేవి రూపంలో దుర్గమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం సీఎం చంద్రబాబు దంపతులు.. దుర్గమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన విషయం విదితమే.
Updated Date - Sep 30 , 2025 | 09:44 PM