సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సు
ABN, Publish Date - Sep 16 , 2025 | 02:14 PM
రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశం.. సెప్టెంబర్ 16తో అంటే.. ఈరోజుతో ముగియనుంది.
రాజధాని అమరావతిలో జిల్లా కలెక్టర్ల సదస్సు మంగళవారం రెండో రోజు ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సులో తొలుత స్వచ్ఛంధ్రాపై పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పారిశుద్ధ్యం, ప్రజా అవగాహన తదితర కీలక అంశాలను ఆయన వివరించారు.
అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం తీసుకొచ్చామన్నారు. మొదటిసారి సింగపూర్ వెళ్లి అక్కడి పరిస్థితులు అధ్యయనం చేశానని చెప్పారు.
హైదరాబాద్లో నైట్ క్లీనింగ్ ప్రారంభించామని గుర్తు చేశారు. పొరుగు సేవల సిబ్బంది నియామకం కూడా అదే తొలిసారి అని వివరించారు.
ప్రధాని తనకు అవకాశమిస్తే స్వచ్ఛభారత్ రిపోర్టు సైతం ఇచ్చానన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ను ఉద్యమంగా చేస్తున్నామని స్పష్టం చేశారు. స్వచ్ఛత అంటే శుభ్రతే కాదు.. అన్ని కోణాల్లో చూడాలని పేర్కొన్నారు.
ఒకప్పుడు ఆనంద ఆదివారం కూడా పెట్టామని తెలిపారు. ఎవరికి ఏ ప్రతిభ ఉంటే దాన్ని బయటపెట్టేవాళ్లమని పేర్కొన్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం కొన్ని కార్యక్రమాలు వచ్చాయని చెప్పారు. లాఫింగ్ సొసైటీ, షౌటింగ్ సొసైటీలు వస్తున్నాయని వివరించారు.
సర్క్యులర్ ఎకానమీ పాలసీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాలని సూచించారు.
ముఖ్యంగా డ్రైన్లు శుభ్రం చేయాల్సి ఉంటుందన్నారు. వర్షపు నీరు, ఇళ్లలోకి నీరు వస్తే ఇంకిపోయేలా టెక్నాలజీ తీసుకొచ్చారని తెలిపారు.
ఏపీలో అన్ని నగరాలు స్వచ్ఛ అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు. ఏళ్లుగా పేరుకు పోయిన చెత్తను జనవరి 1లోగా తొలగించాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనదేనని స్పష్టం చేశారు.
17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు.5 సర్క్యులర్ ఎకానమీ పార్కులు పెడతాని సీఎం చంద్రబాబు తెలిపారు.
రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సమావేశం సోమవారం సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. ఈ సమావేశం ఈ రోజు అంటే.. మంగళవారంతో ముగియనుంది.
Updated Date - Sep 16 , 2025 | 02:19 PM