ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

National Handloom Day: నేతన్నలకు తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం ఉందని: సీఎం చంద్రబాబు నాయుడు

ABN, Publish Date - Aug 07 , 2025 | 09:40 PM

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం (ఆగస్ట్ 07) మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి సవిత, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

1/13

రాజధాని అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

2/13

గురువారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

3/13

ఈ సందర్భంగా సీఎ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. భారతీయ శక్తి, సంస్కృ‌తి, సంప్రదాయాలకు ప్రతీక చేనేతలని పేర్కొన్నారు.

4/13

నైపుణ్యం, సృజనాత్మకత కలయిక చేనేతలని ఆయన అభివర్ణించారు. నేతన్నలకు తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం ఉందని గుర్తు చేశారు. నేతన్నలకు ఉపాధి కల్పించిన నేత నందమూరి తారక రామారావు అని తెలిపారు.

5/13

వ్యవసాయం తర్వాత అధికంగా ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ అని వివరించారు. 55, 500 మంది చేనేత కార్మికులకు రూ. 2 లక్షల చొప్పున రూ. 27 కోట్లు రుణాలుగా అందించామన్నారు.

6/13

అలాగే 90,765 కుటుంబాలకు 100 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇచ్చామని చెప్పారు.

7/13

చేనేత కార్మికులకు తొలిసారిగా 50 ఏళ్లకే పింఛన్ అందించాలని నిర్ణయించామన్నారు. చిన్న వయస్సులోనే నేతన్నలు అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి ఉందన్నారు.

8/13

అందుకే 50 ఏళ్లకే పింఛన్ తీసుకొచ్చామని వివరించారు. 50 శాతం సబ్సిడీతో మర మగ్గాలకు రూ. 80 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు.

9/13

ఆగస్ట్ 2025 నుంచి 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇఖ మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామన్నారు.

10/13

ఈ ఉచిత విద్యుత్ వల్ల 93 వేల కుటుంబాలకు లబ్ది చేకూరుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చేనతలకు ఎంత ఇచ్చినా తక్కువే అవుతుందన్నారు.

11/13

మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... తాము కుటుంబపరంగా ఏదైనా శుభకార్యానికి హాజరైతే అక్కడ వారికి చేనేత వస్త్రాలనే అందజేస్తున్నామని చెప్పారు. తమ కుటుంబం చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని నేతన్నలకు హామీ ఇచ్చారు.

12/13

ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, పలువురు ప్రజా ప్రతినిధులతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

13/13

ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఎంపీ సుచిత్రా ఎల్లా సైతం పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2025 | 09:40 PM