Nataraja Natyanjali: నటరాజ నాట్యాంజలి అకాడమీ ఆధ్వర్యంలో కమ్మింగ్ నగరంలో చెంచు లక్ష్మి నృత్య నాటిక ప్రదర్శన
ABN, Publish Date - Oct 23 , 2025 | 09:22 PM
నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో జార్జియాలోని కమ్మింగ్ నగరంలోని ఫోకల్ సెంటర్లో నిర్వహించిన చెంచు లక్ష్మి నృత్య నాటిక ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో జార్జియాలోని కమ్మింగ్ నగరంలోని ఫోకల్ సెంటర్లో నిర్వహించిన చెంచు లక్ష్మి నృత్య నాటిక ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ సౌత్ ఫోర్సిత్ కౌంటీ తోడ్పాటు అందించింది. ఈ సందర్భంగా సేకరించిన నిధులను కార్యక్రమ నిర్వాహకులు ఫోర్సిత్ కౌంటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్కు (FCEF) అందజేశారు. ఈ కార్యక్రమాన్ని హర్షిణి చుండి, శ్రీలేఖ ఆదుసుమిల్లి సమన్వయ పరిచారు. ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రేరణను మాలతి నాగభైరవ వివరించారు. కళ మనసును మేల్కొలుపుతుందని, విద్య భవిష్యత్తును వెలిగిస్తుందని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీరామ్ రొయ్యాల మాట్లాడుతూ సంస్కృతి మనసులను కలుపుతుందని అన్నారు. కళ ద్వారా సమాజ సేవ చేయగలగడం గొప్ప విషయమని చెప్పారు. డిస్ట్రిక్ట్ 25 ప్రతినిధి టాడ్ జోన్స్ మాట్లాడుతూ వైవిధ్యంలో ఏకత్వానికి ఇలాంటి కార్యక్రమాలే దానికి సజీవ నిదర్శనమని అన్నారు. కళ మనసుకు భాష అని, విద్య మనసుకు కాంతి అని వ్యాఖ్యానించారు. ఈ రెండూ కలిసినప్పుడు సమాజం వెలిగిపోతుందని చెప్పారు.
ఇవీ చదవండి..
చంద్రబాబు యూఏఈ పర్యటన.. దుబాయ్లో సీఎంకు ఘన స్వాగతం
వార్సాలో వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం!
Updated Date - Oct 24 , 2025 | 04:41 PM