NRI: వర్జీనియాలో తెలుగు ఆడపడుచుల గోరింటాకు పండుగ
ABN, Publish Date - Jul 22 , 2025 | 10:11 PM
ఆషాఢ మాసం సందర్భంగా వర్జీనియాలో తానా ఆధ్వర్యంలో తెలుగు ఆడపడుచుల గోరింటాకు పండుగ ఘనంగా నిర్వహించారు.
తానా ఆధ్వర్యంలో ఆషాడ మాసం సందర్భంగా పండగ నిర్వహణ
అమెరికాలో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టిన కార్యక్రమాలు
వర్జీనియా, జులై 22: ఏ దేశంలో ఉన్నా మన సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుకోవడంలో తెలుగు మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తారని తానా సాంస్కృతిక విభాగం కో ఆర్డినేటర్ సాయిసుధా పాలడుగు పేర్కొన్నారు. అమెరికాలో తెలుగు వారి జీవన విధానం, సంస్కారం, పండుగల్ని భావితరాలకు తెలియజేయడం కోసం.. భాష కట్టుబొట్టుల్ని కాపాడడం కోసం తానా ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆమె తెలిపారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని అమెరికాలోని వర్జీనియాలో తానా ఆధ్వర్యంలో "ఆడపడుచుల గోరింటాకు పండుగ" కార్యక్రమాన్ని ఇటీవల ఘనంగా నిర్వహించారు.
తానా సాంస్కృతిక విభాగం కో ఆర్డినేటర్ సాయిసుధా పాలడుగు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, సీనియర్ పాత్రికేయుడు డీఎన్ ప్రసాద్, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో స్థానిక తెలుగు మహిళలు పాల్గొన్నారు. అందరూ గోరింటాకు పెట్టుకున్నారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి. ఈ కార్యక్రమంలో సుధీర్ కొమ్మి, జానీ నిమ్మలపూడి, రాజేష్ కాసరనేని, అనిత మన్నవ, శ్రీవిద్య సోమ, అనీల్ ఉప్పలపాటి, రవి అడుసుమిల్లి, భాను మాగులూరి, శాంతి పారుపల్లి, కవిత చల్లా, త్రిలోక్ కంతేటి, సాయి బొల్లినేని, సత్య సూరపునేని, ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఖతర్ నుంచి స్వదేశానికి చేరుకున్న తెలుగు పాస్టర్లు
డల్లాస్లో ఎన్నారై టీడీపీ ఆత్మీయ సమావేశం.. పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు
Updated Date - Jul 22 , 2025 | 10:16 PM