Home » NRI
ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ వచ్చేనెలలో అమెరికాలో పర్యటించనున్నారు. అక్కడి తెలుగు ఎన్నారై కమ్యూనిటీతో సమావేశం కానున్నారు. ఏపీలోకి పెట్టుబడులు లక్ష్యంగా లోకేష్ పర్యటన ఉంటుందని సమాచారం. ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ వింగ్తో లోకేష్ ఆత్మీయ భేటీ జరుపనున్నారు.
డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. పలువురు దాతలు విరాళాలను అందించారు.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగువెన్నెల' 220 వ సాహిత్య సదస్సు.. డాలస్ టెక్సాస్లోని సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. ' మహాకవి వాక్పతిరాజు - సాహితీ విహంగ వీక్షణం ' అంశం పై ముఖ్య అతిథి శ్రీ పరిమి శ్రీరామనాథ్ ప్రసంగం సాహితీ ప్రియులను విశేషంగా అలరించింది.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తానా సాహిత్య విభాగం.. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాల సాహిత్య భేరిని నిర్వహిస్తుంది. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా బాల సాహితీవేత్తలకు ఆహ్వానం పలుకుతోంది.
నవ్యాంధ్రప్రదేశ్లో సంపద సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిలో దుబాయి, గల్ఫ్ దేశాల్లోని తెలుగు వైశ్య వ్యాపాస్థులు తమ వంతుగా పూర్తిగా సహకరిస్తామని సంసిద్ధత వ్యక్తం చేశారు.
పెద్ద సంఖ్యలో తెలుగు, తమిళ, కన్నడ ఇతర రాష్ట్రాల భక్తులు పాల్గొని, స్వామి-అమ్మవారి కళ్యాణం తిలకించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. భక్తులకు టీటీడీ లడ్డు ప్రసాదం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం కళ్యాణ ప్రసాద భోజనమును అందించారు.
జర్మనీలోని హాంబర్గ్లో శ్రీనివాస కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు, తమిళ, కన్నడతోపాటు జర్మనీలో నివసిస్తున్న భారత్లోని ఇతర రాష్ట్రాల వారు సైతం భారీ సంఖ్యలో హాజరయ్యారు.
అమెరికాలోని డల్లాస్లో రెండు పుస్తకాల పరిచయ సభ ఘనంగా జరిగింది. ‘ఊహల కందని మొరాకో’, ‘మనమెరుగని లాటిన్ అమెరికా’ పేర్లతో నిమ్మగడ్డ శేషగిరి ఫేస్బుక్లో రాసిన కథనాలను, ప్రముఖ రచయిత దాసరి అమరేంద్ర తెలుగులోకి అనువదించారు. ఈ రెండు పుస్తకాల పరిచయ కార్యక్రమం.. డల్లాస్లోని సాహితీప్రియుల మధ్య నిర్వహించారు.
మాతృభూమికి దూరంగా విదేశాల్లో ఉంటూ తమ సంస్కృతిని పరిరక్షించుకోవడంతో పాటు అపదలో ఉండే సహచర తెలుగువారికి ఆపన్నహస్తం అందించడానికి ఉద్దేశించిన తెలుగు ప్రవాసీ సంఘాలు ఒక ప్రహాసంగా మారుతున్నాయి.
ఏటా వేలాది మందితో బతుకమ్మ పండుగను నిర్వహిస్తూ విదేశాల్లో ఉన్న తెలుగువారిని మైమరిపింపజేస్తున్న తెలంగాణ పీపుల్స్ అసోసియేషన ఆఫ్ డాలస్ (టీపాడ్) ఈసారి వేడుకను మరింత మెమొరబుల్గా నిర్వహించింది.