Home » NRI
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తెలుగు ప్రజల ఆశలసౌధమని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. అమెరికాలోని మేరీల్యాండ్లో శ్రీనాథ్రావుల అధ్యక్షతన ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది.
ప్రవాసాంధ్రుల సంక్షేమం, సమస్యల పరిష్కరానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఏపీ ఎన్ఆర్టీ భవన్లో మంత్రి కొండపల్లితో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సలహా కమిటీ సమావేశమైంది.
లండన్ వేదికగా తెలుగు ఎన్నారైల క్రికెట్ పండుగ షురూ అయింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో 10 జట్లతో TPL 2026 17వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 16 వరకు సాగనున్న ఈ సమరంతో పాటు ఆరోగ్య స్పూర్తిని రగిలించే 'వన్ మిలియన్ అడుగుల ఛాలెంజ్' కూడా నిర్వహిస్తున్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) గోల్డెన్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలోని 50 నగరాల్లో 50 రహదారులను దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ, పరిశుభ్రత, పరిరక్షణ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తానా చేపట్టింది.
బాపులపాడు మండలంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తానా కోశాధికారి, ప్రముఖ ఎన్నారై రాజా కసుకుర్తి నిరంతరాయంగా అందిస్తున్న సేవలు అభినందనీయమని గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ వెల్లడించారు.
అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా.. బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం నిర్వహించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సారధ్యంలో సంగీత సాహిత్య హాస్యం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు దాతో కాంతారావు నాయకత్వంలో వార్షిక సమావేశంతో పాటు ప్రతిష్ఠాత్మకమైన ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగంపై ప్రత్యేక సదస్సు కూడా నిర్వహించారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో కాలేజీలో చేరబోయే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం నిర్వహించిన ‘తానా స్కాలర్షిప్ వెబినార్’ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ వెబినార్లో కాలేజీ అడ్మిషన్ల ప్రక్రియ, స్కాలర్షిప్ అవకాశాలపై విలువైన సూచనలను అందించారు.
పొట్టకూటి కోసం గల్ఫ్లో ఉంటున్న తెలంగాణ వాస్తవ్యుడు నరేష్ తన అభిరుచి అయిన రచనావ్యాసంగంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
డల్లాస్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఫండ్రైజర్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. రాబోయే ATA 19వ మహాసభల నేపథ్యంలో ఈ ఈవెంట్ నిర్వహించగా, స్థానిక తెలుగు సమాజం పెద్దఎత్తున పాల్గొంది.