Home » NRI
అమెరికాలో మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్)ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా నగర పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన భారీ అండర్కవర్ ఆపరేషన్లో ఒక తెలుగు వ్యక్తితో సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగానే కాకుండా అమెరికాలో నివసిస్తున్న తెలుగు సమాజంలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది..
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తమ మాతృభూమిలో పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. భారత స్టాక్ మార్కెట్లో ఎన్నారైల పెట్టుబడుల పరిమితిని పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదించారు. మరోవైపు, దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేశారు.
‘డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి’ అధ్యక్షురాలిగా లక్ష్మి పోరెడ్డి ఎంపికయ్యారు. డల్లాస్లో అత్యంత ప్రభావవంతమైన తెలుగు సంస్థకు అధ్యక్షురాలిగా వరుసగా మూడవసారి ఒక మహిళే ఎన్నిక కావడం విశేషం.
ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఒక ఎన్ఆర్ఐ జంట డిజిటల్ అరెస్ట్ కావడమే కాదు.. ఏకంగా రూ.15 కోట్ల వరకు మోసపోయారు. ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.
అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో తెలుగు విద్యార్థి కనిపించకుండా పోయారు. గుంటూరుకు చెందిన హరి కృష్ణా రెడ్డి ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లారు..
నెబ్రాస్కా తెలుగు సమితి (టీఎస్ఎన్) ఆధ్వర్యంలో తొలి యువజన సదస్సును అత్యంత వైభవంగా నిర్వహించింది. 7వ తరగతి నుంచి కాలేజీ వరకు అనేక మంది భారతీయ అమెరికన్ విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
తానా(తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా) మిన్నియాపాలిస్లో నిర్వహించిన ఫుడ్ డ్రైవ్ విజయవంతమైంద. ‘Giving Back to the Community’ అనే నినాదం తో ఈ సంవత్సరం పలు సేవా కార్యక్రమములో పాల్గొని సేవయే తమ ప్రధమ కర్తవ్యంగా ముందుకి వెళుతోంది.
పాత భవనాల్లో ఉండే 'ఆస్బెస్టాస్' వల్ల కార్మికులకు కలిగే ఆరోగ్య ప్రమాదాలను ఈ బృందం గుర్తించింది. దానికి పరిష్కారంగా ఒక అత్యాధునిక రోబోటిక్ వ్యవస్థను ప్రతిపాదించింది. నిపుణుల సలహాలు తీసుకుంటూ.. క్షేత్రస్థాయి పరిశోధనలు చేసి వీరు రూపొందించిన ఈ 'ఇన్నోవేషన్ ప్రాజెక్ట్' అందరి ప్రశంసలు అందుకుంది.
తెలంగాణ విమానయాన తయారీ రంగంలో వృత్తి నైపుణ్యత పెంచేందుకు తనవంతు కృషి చేస్తానని అమెరికాలోని బోయింగ్ విమాన తయారీ సంస్థ శాస్త్రవేత్త, పరిశోధన విభాగ అధిపతి ప్రో. మామిడాల రాములు అన్నారు.
గుంటూరు నాట్స్ ఆధ్వర్యంలో జానపద సంబరాలు ఘనంగా జరిగాయి. తప్పెటగుళ్లు, దరువులు, కోలాటాల సందడి.. తెలుగు జానపద శోభను ప్రతిబింబించాయి.