Supreme Court: ఆలయ బోర్డులలో ముస్లింలకు చోటిస్తారా? కేంద్రానికి సుప్రీం సూటిప్రశ్న
ABN, Publish Date - Apr 16 , 2025 | 07:59 PM
కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లలో ముస్లిమేతరలను చేర్చే నిబంధనను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తావించింది. హిందూ ఎండోమెంట్ బోర్డులలో ముస్లింలు భాగం కావడానికి కేంద్రం అనుమతిస్తుందా అని సూటిగా ప్రశ్నించింది.
న్యూఢిల్లీ: పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారంనాడు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రానికి కీలక ప్రశ్నలు వేసింది. సుమారు 73 పిటిషన్లపై సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మసానం విచారణ చేపట్టింది.
Waqf Bill Supreme Court: వక్ఫ్ పిటిషన్లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లలో ముస్లిమేతరలను చేర్చే నిబంధనను ధర్మాసనం ప్రస్తావించింది. హిందూ ఎండోమెంట్ బోర్డులలో ముస్లింలు భాగం కావడానికి కేంద్రం అనుమతిస్తుందా అని సూటిగా ప్రశ్నించింది. దీనిపై కేంద్రం తరఫు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం నుంచి వివరణ తీసుకునేందుకు సమయం ఇవ్వాలని కోరారు. పార్లమెంటులో విస్తృత చర్చ జరిగిన తర్వాతే చట్టానికి ఆమోదం లభించిందని, జాయింట్ పార్లమెంటు కమిటీ పరిశీలన తర్వాతే ఉభయ సభల్లో తిరిగి ఆమోదం పొందిందని తుషార్ మెహతా చెప్పారు. తిరిగి సీజేఐ మరో ప్రశ్న లేవనెత్తుతూ, వక్ఫ్ బై యూజర్ను ఒక జడ్జిమెంట్లో కోర్టు సమర్ధిస్తే అది ఇప్పుడు చెల్లుబాటుకాదా? అని అడిగారు. వక్ఫ్లోని చాలా మసీదులు 13,14,15వ శాతాబ్దానికి చెందినవి కూడా ఉన్నాయని, వాటి డాక్యుమెంట్లు తెమ్మంటే ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు.
ఒక పిటిషనర్ తరఫు సీనియర్ అడ్వకేట్ అబిషేక్ మను సింఘ్వి తన వాదన వినిపిస్తూ, దేశంలో 8 లక్షల వక్ఫ్ ప్రాపర్టీలలో వక్ఫ్ బై యూజర్ ప్రాపర్టీలు 4 లక్షలు ఉన్నాయన్నారు. దీనిపై సీజేఐ జోక్యం చేసుకుంటూ ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలో కట్టామంటున్నారని, అన్ని వక్ఫ్ బై యూజర్లు తప్పని తాము చెప్పుడం లేదని, అయితే కొన్ని సహజమైన ఆందోళనలను కూడా ఉన్నాయని అన్నారు. దీనిపై సింఘ్వి స్పందిస్తూ, మొత్తం చట్టం మీద తాము స్టే కోరడం లేదని, కొన్ని ప్రొవిజన్లపై స్టే కోరుతున్నామని అన్నారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలో కొత్త చట్టం కలెక్టర్కు ఇచ్చే అధికారాలను ప్రశ్నించారు. కలెక్టర్ కూడా ప్రభుత్వంలో భాగమైనప్పుడు ఆయన న్యాయమూర్తి పాత్ర పోషిస్తే అది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. అనంతరం విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి...
Rahul Gandhi: రెండు రకాల గుర్రాలు.. గుజరాత్లో కాంగ్రెస్ వ్యూహంపై రాహుల్
BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్
Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ
Ramdev: రామ్దేవ్ 'షర్బత్ జిహాద్' వ్యాఖ్యలపై దిగ్విజయ్ కేసు
Updated Date - Apr 17 , 2025 | 06:12 PM