Home » New Delhi
న్యూఢిల్లీలో బుధవారంనాడు జరిగిన యూఏవీ, కౌంటర్-అన్మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (సి-యూఏఎస్) స్వదేశీకరణ వర్క్షాప్లో అనిల్ చౌహాన్ మాట్లాడుతూ, ఇవాల్టి అధునాతన యుద్ధంలో అత్యాధునిక సాంకేతికతకు ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు.
సీజేఐ ఈనెల 12న హైదరాబాద్లో పర్యటించారు. 'నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా' స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాతే ఆయన ఇన్ఫెక్షన్ బారినపడినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ పర్యటనలోనే 'బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్- రాజ్యాంగ సభ-భారత రాజ్యాంగం' పేరిట ఒక పోస్టల్ కవర్ను విడుదల చేశారు.
హత్య చేసిందన్న నేరంపై యెమెన్ దేశంలో మరణశిక్ష పడ్డ కేరళ నర్సు నిమిష ప్రియ 36 కేసు చివరి నిమిషంలో మలుపు తిరిగింది.
ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల తేల్చిచెప్పారు. డీకే, తానూ కలిసి పనిచేస్తున్నామని, పార్టీ ఐక్యంగా ఉందని చెప్పారు. డీకే శివకుమార్ సైతం తనకు మరో దారి లేదని, అధిష్ఠానం నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో తుర్కియే దేశం బహిరంగంగా పాకిస్థాన్కు మద్దతిచ్చింది. ఈక్రమంలోనే బీసీఏఎస్ మే 15న భారతదేశంలోని 9 ప్రధాన విమానాశ్రయాలకు సేవలందిస్తున్న గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సర్వీసెస్ ప్రొవైడర్ అయిన సెలెబికి సెక్యూరిటీ అనుమతిని రద్దు చేసింది.
క్యాబ్ డ్రైవర్లను అంతమొందించి వారి కార్లను విక్రయించి సొమ్ము చేసుకునే ఓ సీరియల్ కిల్లర్ను ఢిల్లీ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. 24 ఏళ్లుగా పరారీలో ఉన్న అతడిని ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు.
దేశంలోని వివిధ కాలేజీలు, యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష సీయూఈటీ యూజీ వ్యవస్థ లోపభూయిష్ఠంగా మారిందన్న విమర్శలొస్తున్నాయి.
ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా ఆగస్టు 13, 14 తేదీల్లో పార్లమెంటు సమావేశాలు ఉండవు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకూ ఉంటాయని ఇంతకుముందు ప్రకటించారు.
ఇంతవరకూ 28 రాష్ట్రాల్లో బీజేపీ అంతర్గత సంస్థాగత ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు కనీసం 19 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల ఎన్నిక తప్పనిసరి.
నిందితులపై తగినన్ని సాక్ష్యాధారాలు ఉన్నందున బెయిల్ ఇవ్వరాదని ఢిల్లీ పోలీసులు విచారణ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్వసనీయ పత్రాలు, మెటీరియల్ ఉన్నందున 1967 చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద శిక్షార్హులని కోర్టుకు విన్నవించారు.