Home » New Delhi
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఆయన భారత్లో పర్యటించనున్నారు. న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమవేశం-2026లో పాల్గొంటారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వస్తు సేవల పన్ను లావాదేవీలలో జరిగిన భారీ మోసాలకు సంబంధించి పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు రూ.100 కోట్ల మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ అరెస్ట్ జరిగినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
దాదాపు 300 ఏళ్ల క్రితం దేశం దాటి వెళ్లిన 11వ శతాబ్దపు నాటి అత్యంత అరుదైన, ప్రతిష్టాత్మక చోళుల కాలం నాటి రాగి శాసనాలు నెదర్లాండ్స్ నుంచి తిరిగి భారతదేశానికి చేరనున్నాయి. అయితే, ఈ రాగి శాసనాలు పొందుపరిచిన వలయం మీదున్న రాజముద్రలోని చిహ్నాలు దేనికి సంకేతాలో చూద్దాం..
ఢిల్లీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బస్సు డ్రైవర్, కండక్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఒక వివాహిత ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపార సంస్థలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ECLGS 5.0 పథకానికి ఆమోదం తెలుపుతూ, దాదాపు రూ. 2.55 లక్షల కోట్ల రుణ పరపతిని కల్పించాలని నిర్ణయించింది.
పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో BJP విజయాన్ని AAP జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితం మాత్రమే కాదని, దేశ భవిష్యత్తుపై దీని ప్రభావం ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అసాధారణమైన, చారిత్రక తీర్పునిచ్చారని, ఆ ఆనందం కార్యకర్తల కళ్లలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బెంగాల్లో నూతన చరిత్రను ఆవిష్కరించిన బీజేపీ కార్యకర్తలను అభినందించారు.
ఢిల్లీలో ఒక యువ జడ్జి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. సీలింగ్ ఫ్యాన్ నుంచి వేలాడుతున్న ఆయన మృతదేహాన్ని గుర్తించిన బంధువు ఒకరు పోలీసులకు సమాచారం అందించారు.
దేశవ్యాప్తంగా జనం ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందరి మొబైల్ ఫోన్స్లలో ఒకేసారి వైబ్రేషన్ అలర్ట్స్ వచ్చాయి. అయితే ఇది, ప్రజలందర్నీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి టెలికమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ NDMA కలసి నిర్వహించిన టెస్ట్ డ్రైవ్.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే పలకరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మే నెల చివరి వారంలో వచ్చే రుతుపవనాలు, ఈసారి మే 14 - 16 మధ్యలోనే అండమాన్ నికోబార్ దీవులను తాకనున్నాయని పేర్కొంది.