Home » New Delhi
కేజ్రీవాల్ మాయలో ఢిల్లీ ప్రజలు చిక్కుకోవద్దని బిధూరి సూచించారు. ఢిల్లీ ప్రజల కోసం అంకితమైన బీజేపీకి మెజారిటీ ఇవ్వాలని కోరారు. బీజేపీ అంటే తనకు ఎంత అంకితభావం ఉందో ప్రజల పట్ల కూడా అంతే అంకితభావం ఉందని చెప్పారు.
అమెరికా కొత్త పాలనాధికారులతో పాటు వివిధ దేశాల అధినేతలతో జైశంకర్ చర్చలు జరిపే అవకాశాలున్నట్టు విదేశాంగ శాఖ ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.
నకిలీ ఓట్లు సృష్టించేందుకు బీజేపీ కొత్త మార్గం ఎంచుకుందని సీఈసీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ ఆరోపించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నేతల తమ ఇంటి అడ్రెస్సులతో నకిలీ ఓట్లు సృష్టించుకుంటున్నారని అన్నారు.
గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో ఆప్ పొత్తుపెట్టుకున్నప్పటికీ ఆ తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ఆప్ మొదట్లోనే ప్రకటించింది.
ఢిల్లీలో 'ఆప్' తమకు విపక్షమని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి బుధవారంనాడు జరిగిన ఒక కార్యకర్మంలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించడంపై ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చురకలు వేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను రాజీవ్ కుమార్ ప్రకటించిన నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత మీ ప్లాన్స్ ఏమిటని మీడియా అడిగినప్పుడు... మీ అందరికీ దూరంగా హిమాలయాల్లోని సుదూర ప్రాంతాలకు వెళ్లి నాలుగైదు నెలలు ఉంటానన్నారు.
ప్రభుత్వ గౌరవాలను అడిగి తీసుకోరాదని, వాటంతటవే వరించి రావాలని బాబా (ప్రణబ్) చెప్పేవారని, బాబా మెమెరీని గౌరవిస్తూ ముందుకు వచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని షర్మిష్ట ముఖర్జీ చెప్పారు.
అప్డేట్ చేసిన జాబితా ప్రకారం దేశ రాజధానిలో 1,55,24,858 మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. వీరిలో 84,49,645 మంది పురుష ఓటర్లు, 71,73,952 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
కర్ణాటక మోడల్ తరహాలోనే 'ప్యారీ దీదీ' పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తామని, తొలి మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఖరారు చేస్తామని డీకే శివకుమార్ చెప్పారు.
తన వ్యాఖ్యల చుట్టూ వివాదం రేగడంతో మీడియా ముందు భిదూరి క్షమాపణ చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో చేసిన వ్యాఖ్యలనే తాను ప్రస్తావించానని, ఎవరి మనోభావాలను గాయపరచే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చారు.