Tamilisai: తమిళిసై జోస్యం.. ఎయిమ్స్ ప్రారంభం నాటికి డీఎంకే అధికారంలో ఉండదు
ABN, Publish Date - Jun 19 , 2025 | 12:45 PM
మదురై ఎయిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవ సమయానికి డీఎంకే అధికారంలో ఉండదని బీజేపీ నేత తమిళిసై సౌందర్రాజన్ జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేసేలా షోలింగనల్లూర్లో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు.
- తమిళిసై సౌందర్రాజన్
చెన్నై: మదురై ఎయిమ్స్ ఆస్పత్రి(Madurai AIIMS Hospital) ప్రారంభోత్సవ సమయానికి డీఎంకే(DMK) అధికారంలో ఉండదని బీజేపీ నేత తమిళిసై సౌందర్రాజన్(Tamilisai Soundararajan) జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేసేలా షోలింగనల్లూర్లో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో తమిళిసై మాట్లాడుతూ... ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్ధికవ్యవస్థ గా భారత్ను రూపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) కృషిచేస్తున్నారని అన్నారు. ఎయిమ్స్ ఆసుపత్రి నిర్ణీత సమయంలోనే ప్రారంభించేలా పనులు వేగవంతం చేశారని, ఎన్డీఏ పాలనతో ఎయిమ్స్ ప్రారంభిస్తామని తమిళిసై సౌందర్రాజన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం
ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించాల్సిందే
Read Latest Telangana News and National News
Updated Date - Jun 19 , 2025 | 12:45 PM