Simla Agreement: సిమ్లా ఒప్పందం..ఎందుకు జరిగిందో తెలుసా... అసలు కథేంటి
ABN, Publish Date - Apr 25 , 2025 | 08:44 AM
Simla Agreement: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాంటి భారత్ కీలక నిర్ణయాలు తీసుకొంటే.. పాక్ సైతం అదే దారిలో వెళ్తోంది. ఆ క్రమంలో సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు పాక్ ప్రకటించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి సందర్బంగా 26 మంది మృతి చెందిన నేపథ్యంలో పాకిస్థాన్ విషయంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం స్పందించింది. భారత్ , పాకిస్థాన్ మధ్య జరిగిన సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అసలు సిమ్లా ఒప్పందం ఎందుకు జరిగింది. ఎప్పుడు జరిగింది. ఈ ఒప్పందంపై ఎవరు సంతకాలు చేశారు. ఈ ఒప్పందానికి ఈ రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయా? లేక ఉల్లంఘించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ఓ సారి పరిశీలిస్తే..
ఇందిరా గాంధీ, బుట్టో మధ్య ఒప్పందం..
1971లో భారత్ - పాకిస్థాన్ల మధ్య యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పే లక్ష్యంతో 1972లో సిమ్లా ఒప్పందం జరిగింది. ఇది 1972, జులై 2వ తేదీన హిమాచల్ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్థాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ బుట్టో మధ్య జరగడంతో.. ఈ ఒప్పందంపై వీరిద్దరు సంతకం చేశారు. ఈ ఒప్పందం ఆగస్ట్ 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
మూడో పక్షం జోక్యం..
ఈ ఒప్పదం ప్రకారం.. ఈ ఇరు దేశాల మధ్య ఏమైనా వివాదాలు తలెత్తితే.. శాంతియుతంగా.. ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. అయితే మూడో పక్షం జోక్యం ఉండకోడదని పేర్కొంది. అలాగే ఈ ఒప్పందం ప్రకారం..1971 నాటి కాల్పుల విరమణ..నియంత్రణ రేఖ (లైన్ అఫ్ కంట్రోల్ - ఎల్ఓసీ)గా గుర్తించి, దానిని ఏకపక్షంగా మార్చరాదని ఇరు దేశాలు అంగీకరించాయి. ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని,పరస్పర ప్రాదేశిక సమగ్రతను,సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవాలని కూడా ఈ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు.
పొరుగు దేశం ఉల్లంఘనలు..
మూడోసారి ప్రధానిగా..
పహల్గాంలో ఉగ్రదాడి.. భారత్ కీలక నిర్ణయం
స్పందించిన పాకిస్థాన్..
ఈ నేపథ్యంలో పాక్ సైతం స్పందించింది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదీకాక భారత్, పాక్ దేశాల మధ్య ఉన్న నియంత్రణ రేఖ వద్ద పొరుగుదేశం కాల్పులకు తెగబడుతోంది. తద్వారా భారత్తో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈ విధంగా గతంలో చేసుకొన్న సిమ్లా ఒప్పందాన్ని పాక్ ఏనాడు గౌరవించలేదని ఆ దేశ చర్యలను పరిశీలిస్తే ఇట్టే అవగతమవుతోంది.
For National News And Telugu News
Updated Date - Apr 25 , 2025 | 09:14 AM