Pahalgam Terror Attack: నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు తెగబడ్డ పాక్
ABN, Publish Date - Apr 25 , 2025 | 07:42 AM
Pahalgam Terror Attack: పాకిస్థాన్ తన తెంపరితనాన్ని చాటుకొంటుంది. ఇప్పటికే పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 26 మంది ఉసురు తీశారు. ఈ నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. అలాంటి వేళ.. నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ మరోసారి తన దుందుడుకు తనాన్ని ప్రదర్శించింది.
ఇస్లామాబాద్, ఏప్రిల్ 25: జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. అందులోభాగంగా సింధూ జలాలపై చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. అయితే పాకిస్థాన్ సైతం దాదాపుగా అదే స్థాయిలో స్పందించింది. ఇరు దేశాల మధ్య జరిగిన సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు పాక్ ప్రకటించింది.
ఈ నిర్ణయం తీసుకొన్న కొన్ని గంటలకే.. అంటే శుక్రవారం తెల్లవారుజామున పాక్.. నియంత్రణ రేఖ వద్ద భారత్ సైన్యాన్ని రెచ్చగొట్టే చర్యలకు ఉపక్రమించింది. అందులోభాగంగా భారత్ భూభాగంపైకి కాల్పులకు తెగబడింది. దీంతో భారత్ సైన్యం సైతం అదే స్థాయిలో స్పందించింది.. పాక్కు గట్టిగా బదులు ఇచ్చింది. అయితే ఈ కాల్పుల్లో భారతీయ సైనికులకు ఎటువంటి గాయాలు కాలేదని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
For National News And Telugu News
Updated Date - Apr 25 , 2025 | 08:05 AM