Meghalaya Honeymoon Murder: మేఘాలయ మర్డర్ కేసులో మరో ట్విస్ట్
ABN, Publish Date - Jun 29 , 2025 | 06:58 PM
మేఘాలయ మర్డర్ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న షిల్లాంగ్ పోలీసులు, సోనమ్ స్నేహితుడు, ఈ కేసులో మరో నిందితుడైన షిలోమ్ జేమ్స్ను వెంటబెట్టుకుని మధ్యప్రదేశ్లోని రత్లాం అనే ప్రాంతానికి చేరుకున్నారు.
Meghalaya Honeymoon Murder: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజా రఘువంశీ హత్య కేసులో అతని భార్య, కేసులో ప్రధాన నిందితురాలు అయిన సోనమ్ బ్యాగ్ను తగలబెట్టి, ఆధారాలను నాశనం చేశారంటూ నమోదైన కేసుకు సంబంధించి షిల్లాంగ్ పోలీసులు మరో కీలక ఆధారాల్ని సేకరించారు. ఈ కేసులో సోనమ్ స్నేహితుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన షిలోమ్ జేమ్స్ మరో ముద్దాయిగా ఉన్న సంగతి తెలిసిందే. రాజా రఘువంశీని హత్య చేసిన తర్వాత సోమన్కు సంబంధించిన సాక్ష్యాల తాలూకు ఆనవాళ్లను నాశనం చేయడంలో షిలోమ్ జేమ్స్.. సోనమ్కు సహకరించాడన్న సంగతి పోలీసులు ఇప్పటికే కనుగొన్నారు.
ఇలా ఉండగా, రాజా హత్య కేసుకు సంబంధించి షిలోమ్ జేమ్స్ ప్రమేయం మీద ఇప్పటికే పోలీసులు కొన్ని ఆధారాల్ని సేకరించారు. జేమ్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. పలాసియా ఏరియాలోని మురుగుకాలువ నుంచి ఒక ప్లాస్టిక్ బ్యాగ్ను పోలీసులు గతంలోనే వెలికితీసి స్వాధీనం చేసుకున్నారు. జేమ్స్ను వెంటబెట్టుకుని వెళ్లి డ్రైన్లో గాలించగా ప్లాస్టిక్ బ్యాగ్ బయటపడింది. ఇందులో నాటు తుపాకీ ఉన్నట్టు సమాచారం.
ఇవీ చదవండి:
ఆర్సీబీ క్రికెటర్పై యువతి ఫిర్యాదు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 29 , 2025 | 06:58 PM