ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Railways Ticket Prices: ప్రయాణికులకు అలర్ట్.. జూలై 1 నుంచి టికెట్ల ధరల పెంపు

ABN, Publish Date - Jun 30 , 2025 | 09:15 PM

భారతీయ రైల్వే ప్రయాణికులు జూలై 1, 2025 నుంచి ఈ ఛార్జీల గురించి తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే రైల్వే శాఖ ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరల్లో (Railways Ticket Prices) కీలక మార్పులు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Railways Ticket Prices

భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే జూలై 1, 2025 నుంచి ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరల్లో (Railways Ticket Prices) స్వల్ప మార్పులను ప్రకటించారు. ఈ సర్దుబాటు రైల్వే సేవల స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి, ఛార్జీలను సరళీకరించడానికి ఉద్దేశించిందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లలో ఏసీ, నాన్-ఏసీ తరగతులకు స్వల్పంగా ధరలు పెరుగుతాయి.

కానీ సబర్బన్ రైళ్ల ధరలు మాత్రం మారకుండా ఉంటాయి. ఈ కొత్త ధరలు జూలై 1, 2025 నుంచి కొనుగోలు చేసే టికెట్లకు వర్తిస్తాయి. ఇంతకు ముందు కొనుగోలు చేసిన టికెట్ల ధరలు మాత్రం మారవు. ఈ మార్పులను అమలు చేయడానికి PRS, UTS, మాన్యువల్ టికెటింగ్ వ్యవస్థలను అప్‌డేట్ చేశారు.

నాన్-ఏసీ తరగతులు (నాన్-సబర్బన్ రైళ్లు)

సెకండ్ క్లాస్:

  • 500 కిలోమీటర్ల వరకు జర్నీ ధరల్లో ఎలాంటి మార్పు లేదు

  • 501-1500 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి రూ. 5 పెరుగుదల.

  • 1501-2500 కిలోమీటర్ల దూరానికి రూ. 10 పెరుగుదల

  • 2501-3000 కిలోమీటర్ల దూరానికి రూ. 15 పెరుగుదల

  • కిలోమీటరుకు 0.5 పైసలు అదనంగా వసూలు చేస్తారు

  • స్లీపర్ క్లాస్: కిలోమీటరుకు 0.5 పైసలు పెరుగుదల.

  • ఫస్ట్ క్లాస్: కిలోమీటరుకు 0.5 పైసలు పెరుగుదల.

నాన్-ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్ సర్వీసులు

  • సెకండ్ క్లాస్: కిలోమీటరుకు 0.1 పైసలు పెరుగుదల

  • స్లీపర్ క్లాస్: కిలోమీటరుకు 0.1 పైసలు పెరుగుదల

  • ఫస్ట్ క్లాస్: కిలోమీటరుకు 0.1 పైసలు పెరుగుదల

ఏసీ తరగతులు (మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు)

ఏసీ చైర్ కార్, 3-టైర్/3-ఎకానమీ, 2 టైర్, ఫస్ట్/ఎగ్జిక్యూటివ్ క్లాస్, ఎగ్జిక్యూటివ్ తరగతులకు కిలోమీటరుకు 0.2 పైసలు పెరుగుదల వర్తిస్తుంది. ఈ ధరలు వందే భారత్, తేజస్, రాజధాని, శతాబ్ది, దురంతో, హంసఫర్, అమృత్ భారత్, గతిమాన్, మహమాన, జన శతాబ్ది, యువ ఎక్స్‌ప్రెస్, అంత్యోదయ, ఏసీ విస్తాడోమ్ కోచ్‌లు, సాధారణ నాన్-సబర్బన్ సర్వీసులకు వర్తిస్తాయి.

అదనపు ఛార్జీలు

  • రిజర్వేషన్ ఫీజు, సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్‌లు, ఇతర అదనపు ఛార్జీలు మారకుండా ఉంటాయి.

  • GST నిబంధనలు ప్రస్తుతం ఉన్న విధంగానే కొనసాగుతాయి.

  • ఫేర్ రౌండింగ్ నియమాలు యథాతథంగా ఉంటాయి.

ఈ పెరుగుదల ఎందుకు?

భారతీయ రైల్వేలు దేశంలోని అతి ముఖ్యమైన రవాణా వ్యవస్థలలో ఒకటిగా ఉంది. రోజూ లక్షలాది మంది ప్రయాణీకులు ఈ సేవలను ఉపయోగిస్తున్నారు. రైల్వే స్థిరత్వాన్ని కాపాడటానికి, సేవలను మరింత మెరుగుపరచడానికి ఈ స్వల్ప ధరల పెరుగుదల అవసరమని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ధరల సర్దుబాటు ఇండియన్ రైల్వే కాన్ఫరెన్స్ అసోసియేషన్ (IRCA) చేసిన ప్యాసింజర్ టేబుల్ ఆధారంగా జరిగింది.

ప్రయాణీకులు ఏం తెలుసుకోవాలి

  • జూలై 1, 2025 నుంచి కొనుగోలు చేసే టికెట్లకు కొత్త ధరలు వర్తిస్తాయి. అంతకు ముందు కొనుగోలు చేసిన టికెట్లకు ఈ మార్పులు వర్తించవు.

  • సబర్బన్ రైళ్లలో ప్రయాణించే వారికి ఎలాంటి ధరల పెరుగుదల లేదు. కాబట్టి రోజూ ప్రయాణించే వారికి ఇది ఊరట కలిగించే విషయమని చెప్పవచ్చు.

ఇవీ చదవండి:

కొత్త ఫ్లాష్ సేల్ ఆఫర్.. రూ.400కు 400 జీబీ డేటా

సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 30 , 2025 | 09:17 PM