Air India Flight: ఏఐ విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన
ABN, Publish Date - Apr 09 , 2025 | 08:44 PM
తాగిన మత్తులో ఉన్న ఒక ఇండియన్ పాసింజర్ తన తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. బిజినెస్ క్లాస్లో ఈ ఘటన జరిగినట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) విమానం AI 2336లో బుధవారంనాడు షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తాగిన మత్తులో ఉన్న ఒక ఇండియన్ పాసింజర్ తన తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. బిజినెస్ క్లాస్లో ఈ ఘటన జరిగినట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. అయితే దీనికి కారణం ఏమిటనేది వెల్లడించలేదు.
Mallikarjun Kharge: బాధ్యత తీసుకోండి లేదా రిటైర్ కండి: నేతలకు ఖర్గే వార్నింగ్
కాగా, అనుచిత ప్రవర్తనకు పాల్పడిన ప్యాసింజర్ ఒక పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అని, జరిగిన పొరపాటుకు అతను క్షమాపణ చెప్పాడని తెలుస్తోంది. ఫ్లయిట్ సిబ్బంది ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా అధికారులు తెలియజేయడంతో వారు బాధిత ప్యాసింజర్కు బ్యాంకాక్లో తగిన సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. కానీ, అందుకు బాధితుడు నిరాకరించినట్టు ఒక ప్రకటనలో ఏఐ తెలిపింది.
రామ్మోహన్ నాయుడు స్పందన
ఈ ఘటనపై పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెంటనే స్పందించారు. ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరిగినా మంత్రిత్వ శాఖ సత్వరం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎయిర్లైన్స్తతో మాట్లాడి ఏదైనా తప్పు జరిగితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Tahwwur Rana: భారత్కు 26/11 పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా.. ప్రత్యేక విమానంలో తరలింపు
Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో కీలక పరిణామం..
Updated Date - Apr 09 , 2025 | 08:44 PM