ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Shashi Tharoor: ఎమర్జెన్సీ.. మాయని మచ్చ

ABN, Publish Date - Jul 11 , 2025 | 04:12 AM

భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ మాయని మచ్చ అని, ఆ కాలాన్ని ఒక చీకటి అధ్యాయం గా మాత్రమే గుర్తుంచుకోకూడదని, దాన్నొక పాఠంగా అర్థం చేసుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఎంపీ శశిథరూర్‌ అన్నారు.

  • నాడు క్రూరత్వం రాజ్యమేలింది

  • గ్రామీణ ప్రాంతాల్లో బలవంతంగా వేసెక్టమీ ఆపరేషన్లు చేయించిన సంజయ్‌గాంధీ

  • కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌

న్యూఢిల్లీ, జూలై 10: భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ మాయని మచ్చ అని, ఆ కాలాన్ని ఒక చీకటి అధ్యాయం గా మాత్రమే గుర్తుంచుకోకూడదని, దాన్నొక పాఠంగా అర్థం చేసుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఎంపీ శశిథరూర్‌ అన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన రాసిన వ్యాసం ఓ మలయాళ దినపత్రికలో ఇటీవల ప్రచురితమైంది. ఇందిరా గాంధీ పాలనలో అధికార దుర్వినియోగం, బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిర్వహణ, మురికివాడల తొలగింపు తదితర అంశాలను అందులో ఆయన తీవ్రంగా విమర్శించారు. ‘‘అప్పట్లో ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌గాంధీ గ్రామీణ ప్రాంతాల్లో వేసెక్టమీపై ప్రచా ర కార్యక్రమాలు నిర్వహించి, బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిపించారు. ఏకపక్షంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం కోసం హింసను ఆయుధంగా ఉపయోగించారు. ఇలాంటి చర్యలు క్రమంగా నిరంకుశత్వానికి దారితీశాయి. ఇవ న్నీ భార త రాజకీయాల్లో మాయని మచ్చలా మిగిలిపోయాయి. నాటి రోజుల నుంచి పాఠాలు నేర్చుకొని మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి’’ అని శశి థరూర్‌ పేర్కొన్నారు.

Updated Date - Jul 11 , 2025 | 04:12 AM