ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chhattisgarh; నక్సల్‌ ప్రభావిత బస్తర్‌కు త్వరలో రైలు!

ABN, Publish Date - Jun 28 , 2025 | 05:44 AM

ఛత్తీస్‌‌గఢ్‌లోని నక్సల్‌ ప్రభావిత బస్తర్‌ ప్రాంతంలో సమీప భవిష్యత్తులోనే రైళ్లు పరుగులు తీయనున్నాయి.

న్యూఢిల్లీ, జూన్‌ 27: ఛత్తీస్‌‌గఢ్‌లోని నక్సల్‌ ప్రభావిత బస్తర్‌ ప్రాంతంలో సమీప భవిష్యత్తులోనే రైళ్లు పరుగులు తీయనున్నాయి. తెలంగాణలోని కొత్తగూడెంను ఛత్తీస్‌‌గఢ్‌లోని కిరందుల్‌ను కలుపుతూ 160 కి.మీ.ల రైల్వేలైను నిర్మాణానికి జరుపుతున్న లొకేషన్‌ సర్వే తుది అంకానికి చేరుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌‌గఢ్‌రాష్ట్రాల మీదుగా వెళ్లే ఈ రైల్వేలైనులో అత్యధిక భాగం (138 కి.మీ.లు) ఛత్తీస్‌‌గఢ్‌లోనే ఉంటుంది. ఆ రాష్ట్రంలోని నక్సల్‌ ప్రభావిత బస్తర్‌ డివిజన్‌లోని సుక్మా, దంతేవాడ, బీజాపూర్‌ జిల్లాలు ఈ రైల్వే లైను పరిధిలోకి రానున్నాయి.

దీంతో స్థానిక ప్రజలకు ముఖ్యంగా ఆదివాసీ, గిరిజనులకు విద్య, వైద్యం, వ్యాపారం, రవాణా రంగాల్లో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని అధికారులు చెబుతున్నారు. కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో.. అత్యాధునిక లైడార్‌ టెక్నాలజీతో ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. సర్వే పూర్తయిన అనంతరం రైల్వే విభాగం.. డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టును రూపొందిస్తుంది. అది ఆమోదం పొందిన తర్వాత రైల్వే లైను నిర్మాణం మొదలవుతుంది.

Updated Date - Jun 28 , 2025 | 05:44 AM