Home » Chhattisgarh
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరో సారి తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తమ ఆస్తిగా భావించిన వారు.. ఆ పార్టీని తమ పిల్లలకు వంశపారంపర్యంగా ఇచ్చారంటూ సోనియా గాంధీ కుటుంబంపై ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శించారు. కానీ భారతీయులు మాత్రం తమ వంశపారం పర్యంగా వచ్చిన ఆస్తిని.. వారి పిల్లలకు చెందకుండా ప్రయత్నం చేస్తుందంటూ ఆ పార్టీపై మండిపడ్డారు.
గోవాపై భారత రాజ్యాంగాన్ని బలవంతంగా రుద్దారంటూ దక్షిణ గోవా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విరీయటో ఫెర్నాండెజ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందంటూ మండిపడ్డారు.
ప్రధానిగా నరేంద్ర మోదీకి మూడోసారి అవకాశం ఇస్తే.. ఒకటి రెండేళ్లలో దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
ఛత్తీస్గఢ్లోని కాంకెర్లో యాంటీ-మావోయిస్ట్ ఆపరేషనన్ కింద 29 మంది మావోయిస్టులను మట్టుబెట్టిన భద్రతా సిబ్బందిని కేంద్ర హోం మంత్రి అమిత్షా అభినందించారు. ఇది భద్రతా దళాల ఘనవిజయని అన్నారు. గాయపడిన భద్రతా సిబ్బంది త్వరగా కోలుకోవాలని అభిలషించారు.
ఛత్తీస్గఢ్(Chhattisgarh)లోని కంకేర్(Kanker district)లో అతిపెద్ద నక్సలైట్ ఎన్కౌంటర్(encounter) మంగళవారం జరిగింది. ఇందులో భద్రతా బలగాలు 29 మంది నక్సలైట్లను హతమార్చాయి. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్కు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఈ ఎన్కౌంటర్లో మరణించిన 29 మందిలో 15 మంది మహిళలు ఉన్నారని బస్తర్ రేంజ్(Bastar Range) ఐజీ సుందర్రాజ్ తెలిపారు.
ఛత్తీస్గఢ్ లోని కంకేర్ జిల్లాలో మంగళవారం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులు, నక్సలైట్ల మధ్య చోటుచేసుకున్న ఎదురెదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత ఒకరితో సహా 18 మంది మావోయిస్టులు హతమయ్యారు.
రిజర్వేషన్ల విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్షా భరోసా ఇచ్చారు. రిజర్వేషన్లకు స్వస్తి చెప్పేందుకు బీజేపీ ఒక్కనాటికి అనుమతించదని, కాంగ్రెస్ ప్రయత్నించినా అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ రాజకీయాల్లో ఉన్నంత వరకూ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది రాదని, కాంగ్రెస్ ఆ పని చేసినా అనుమతించేది లేదని అన్నారు.
ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో(telangana chhattisgarh border) శుక్రవారం రాత్రి పోలీసులు(police), మావోయిస్టులకు(Maoists) మధ్య జరిగిన ఎన్కౌంటర్(encounter)లో ముగ్గురు మావోలు మృత్యువాత చెందారు. ఈ నేపథ్యంలో మూడు తుపాకులు సహా ఇతర సామాగ్రిని గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నాయి.
ఛత్తీస్గఢ్ లోని బిజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతాదళాలకు, నక్సల్స్ మధ్య హోరాహోరీగా జరిగిన ఈ ఎన్కౌంటర్లో 13 మంది నక్సల్స్ హతమయ్యారు. పలువురు నక్సల్స్ గాయపడ్డారు. మంగళవారంనాడు మొదలైన ఈ ఎన్కౌంటర్ బుధవారంతో ముగిసిందని భద్రతా బలగాలు ఒక అదికారిక ప్రకటనలో తెలిపాయి.
ఛత్తీస్గఢ్లోని జిజాపూర్ జిల్లాలో బుధవారంనాడు భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛికుర్భట్టి, పుష్బక గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో జరిగిన నక్సల్స్ ఏరివేత కార్యక్రమంలో భాగంగా చోటుచేసుకున్న ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు నక్సల్స్ హతమయ్యారు.