ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Wagah Attari border: పాక్‌ నుంచి అఫ్గాన్‌ సరుకు ట్రక్కులకు అనుమతి

ABN, Publish Date - May 17 , 2025 | 05:10 AM

ఆపరేషన్ సిందూర్ కారణంగా సరిహద్దులు మూసివేయడంతో, పాకిస్థాన్‌లో నిలిచిన 150 అఫ్గాన్ సరుకు ట్రక్కులను వాఘా-అట్టారీ సరిహద్దు ద్వారా భారత్‌లోకి రావడానికి అనుమతించారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ అఫ్గాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్‌ఖాన్‌తో ఫోన్‌లో సంభాషించి పహల్గాం ఉగ్రదాడిని ఖండించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

న్యూఢిల్లీ, మే 16: ఆపరేషన్‌ సిందూర్‌ కారణంగా సరిహద్దులు మూసివేయడంతో పాకిస్థాన్‌లో నిలిచిపోయిన 150 అఫ్గాన్‌ సరకు రవాణా ట్రక్కులను వాఘా-అట్టారీ సరిహద్దు ద్వారా భారత్‌ వచ్చేందుకు అనుమతించారు. వీటిలో అధిక శాతం డ్రై ఫ్రూట్స్‌ తీసుకువచ్చేవే. ఇప్పటికే 8 ట్రక్కులు భారత్‌ చేరుకున్నట్లు వ్యాపార సంఘాల ప్రతినిధులు తెలిపారు. మరోవైపు అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల పాలనలోకి వెళ్లాక తొలిసారిగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఆ దేశ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్‌ఖాన్‌ ముత్తాఖీతో గురువారం ఫోన్‌లో సంభాషించారు. ఈమేరకు జైశంకర్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించినందుకు ధన్యవాదాలు తెలిపినట్లు పేర్కొన్నారు. అంతేగాక తప్పుడు, నిరాధార వార్తలతో భారత్‌, అఫ్గానిస్థాన్ల మధ్య విభేదాలు సృష్టించేందుకు జరిగిన ప్రయత్నాలను తిప్పికొట్టడాన్ని స్వాగతించారు. సుదీర్ఘ కాలంగా రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను గుర్తుచేసినట్లు జైశంకర్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 05:10 AM