Shravan Masam 2025: శ్రావణ మాసంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి ఎందుకు తినకూడదు?
ABN, Publish Date - Aug 04 , 2025 | 09:37 AM
శ్రావణ మాసంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి తినకూడదని అంటారు. అయితే, ఈ మాసంలో వాటిని ఎందుకు తినకూడదు? మతపరమైన, శాస్త్రీయ కారణాలు ఉన్నాయా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: శ్రావణ మాసం హిందూ మతంలో చాలా పవిత్రమైనది. ఈ సమయంలో తామసిక ఆహారం తినకూడదని చెబుతారు. హిందూ శాస్త్రంలో ఆహార పదార్థాలను మూడు గుణాలుగా విభజిస్తారు. సాత్విక, రాజసిక, తామసిక. ఉల్లి, వెల్లుల్లిని రాజసిక, తామసిక ఆహారాలుగా పరిగణిస్తారు. ఇవి కోపం, ఉద్రేకం వంటి లక్షణాలను పెంచుతాయని నమ్ముతారు. శ్రావణ మాసంలో భక్తులు ఉపవాసం ఉండి, సాత్విక ఆహారంపై దృష్టి పెడతారు. ఉల్లి, వెల్లుల్లిని తినకపోవడం ద్వారా వారు తమ మనస్సును, శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మికతపై మరింత దృష్టి పెట్టడానికి ఇది సహాయపడుతుంది.
ఆధ్యాత్మికతపై మరింత దృష్టి
శ్రావణ మాసంలో ఉపవాసం, భక్తితో పాటు, ఆహారంలో కొన్ని నియమాలు కూడా పాటిస్తారు. ఉల్లి, వెల్లుల్లితో పాటు, చాలా మంది మాంసాహారం, మద్యం, పొగాకు వంటి వాటిని మానేస్తారు. ఈ నియమాలు శ్రావణ మాసం మొత్తం భక్తులకు ఒక ఆధ్యాత్మిక అనుభవంగా ఉంటుంది. ఇది వారి మనస్సు, శరీరం, ఆత్మను శుద్ధి చేయడానికి సహాయపడుతుంది.
జీర్ణ సమస్యలు:
కొంతమంది వ్యక్తులకు ఉల్లి, వెల్లుల్లి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. గ్యాస్, ఉబ్బరం లేదా IBS (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్) వంటి సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. ఉల్లి, వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు శ్వాసలో దుర్వాసనకు కారణమవుతాయి. ఈ కారణంగా, శ్రావణ మాసంలో చాలా మంది వీటిని తినడం మానేస్తారు.
Also Read:
వర్షాకాలంలో ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఏ వ్యాధి మీ దగ్గరకు రాదు.!
శరీరాన్ని ఫిట్గా ఉంచే ఆరోగ్య చిట్కాలు ఇవే.!
Updated Date - Aug 04 , 2025 | 09:48 AM