ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

James D Watson: డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ కన్నుమూత

ABN, Publish Date - Nov 08 , 2025 | 07:28 AM

డీఎన్ఏలో పరమాణువుల అమరికను వివరించిన అమెరికన్ శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ తుది శ్వాస విడిచారు. డీఎన్ఏ అమరికను అనుగొన్నందుకు ఆయన 1963లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.

James D Watson Passes Away

ఇంటర్నెట్ డెస్క్: జీవం ఉనికికి కారణమైన జన్యు పదార్థం డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న అమెరికన్ శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ శుక్రవారం తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో 97 వయసులో కన్నుమూశారు. న్యూయార్క్‌లోని కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లేబొరేటరీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది (James D Watson Passes Away).

మెలికలు తిరిగిన నిచ్చెన ఆకారంలో ఉన్న డీఎన్ఏ నిర్మాణాన్ని డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అని పిలుస్తారు (DNA Double Helix Structure). ఈ అమరికను కనుగొన్నందుకు బ్రిటన్ శాస్త్రవేత్త ఫ్రాంసిస్ క్రిక్‌‌, మారిస్ విల్కిన్స్‌లతో కలిసి జేమ్స్ డీ వాట్సాన్ 1962లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు (Nobel Prize). డీఎన్ఏకు సంబంధించి రొసాలిండ్ ఫ్రాంక్లిన్, మారిస్ విల్కిన్స్ రూపొందించిన ఎక్స్ రే చిత్రాల ఆధారంగా వాట్సాన్, క్రిక్‌లు 1953లో డబుల్ హెలికల్ స్ట్రక్చర్‌ను వివరించారు. అయితే, 1958లోనే రోసాలిండ్ ఫ్రాంక్లిన్ కన్నుమూయడంతో ఆమెకు నోబెల్ బహుమతి దక్కలేదు.

జేమ్స్ డీ వాట్సన్ 1928లో చికాగోలో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన ఆ తరువాత ఇండియానా యూనివర్సిటీలో జన్యుశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. 1951లో కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీకి చెందిన కావెండిష్ లేబొరేటరీలో చేరారు. అక్కడే ఆయనకు క్రిక్ పరిచయమయ్యారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి డీఎన్ఏ అమరిక గురించి తెలుసుకునేందుకు విస్తృత పరిశోధనలు చేశారు. చివరకు జీవం గురించి కీలక రహస్యాన్ని ఛేదించారు. మానవ జన్యుక్రమాన్ని తెలుసుకునేందుకు ప్రారంభించిన హ్యుమన్ జీనోమ్ ప్రాజెక్టుకు జేమ్స్ 1990లో నేతృత్వం వహించారు. అయితే ప్రభుత్వ విధానాలతో విభేదించి కొంత కాలానికే తప్పుకున్నారు. జేమ్స్ తీరు కొన్ని సార్లు వివాదాలకూ దారి తీసింది. 2007లో ఓ పత్రికా ఇంటర్వ్యూలో ఆయన కామెంట్స్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆఫ్రికా జాతీయులతో పోలిస్తే శ్వేతజాతీయుల మేధోసామర్థ్యం ఎక్కువని కామెంట్ చేయడంపై కలకలం రేగింది.

ఇక వాట్సన్, క్రిక్‌ల ఆవిష్కరణ జీవశాస్త్రంలో అనేక మార్పులను తెచ్చింది. జెనెటిక్ ఇంజినీరింగ్, జీన్ థెరపీ, బయోటెక్నాలజీ వంటి ఆధునిక శాస్త్రాలకు పురుడు పోసింది. డీఎన్ఏ ఆవిష్కరణకు సంబంధించి తన అనుభవాలను వివరిస్తూ వాట్సన్ 1968లో ది డబుల్ హెలిక్స్ అనే పుస్తకాన్ని కూడా రాశారు.

ఇవి కూడా చదవండి:

షుగర్ వ్యాధి ఉంటే ఇక వీసా రానట్టే.. అమెరికా నిబంధనలు మరింత కఠినతరం

హెబ్-1బీ వీసా.. లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తుల పరిశీలన ప్రారంభం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 08 , 2025 | 08:01 AM