Home » Science
పరిశోధన, ఆవిష్కరణల రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింతగా ఆహ్వానిస్తున్నట్టు నిర్మల పేర్కొన్నారు. ప్రాథమిక పరిశోధన, నమూనా అభివృద్ధిలకు అనుసంధాన్ జాతీయ పరిశోధన నిధి ద్వారా కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
జపనీస్ శాస్త్రవేత్తలు(Japan Scientists) మానవ చర్మంతో రోబోకి ముఖాన్ని రూపొందించి అరుదైన రికార్డు సృష్టించారు. మానవ చర్మంతో రూపొందించిన చిరునవ్వుతో ఉన్న ఈ ముఖాన్ని హ్యుమనాయిడ్ రోబోకి జత చేయవచ్చు. రోబోల ముఖ కవళికలు అచ్చం మనిషిలా ఉండాలనే ఉద్దేశంతో వీటిని తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.
దోస్త్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ముగిసింది. ఇందులో భాగంగా డిగ్రీ ప్రథమ సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 76,290 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా.. వీరిలో 58,920 (77.23 శాతం) మంది కామర్స్, లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్ కోర్సులనే ఎంపిక చేసుకున్నారు.
శరీరం వేడి, శ్వాసలోని బొగ్గుపులుసువాయువు శాతం, దుస్తులు రంగు, శ్వేదం వాసన తదితరాల ఆధారంగా దోమలు కొందరికే ఎక్కువగా టార్గెట్ చేస్తాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
సుమారు 25 కోట్ల సంవత్సరాల క్రితం భూమ్మీద ఏకంగా 20 లక్షల ఏళ్ల పాటు వర్షం కురిసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూమిపై జీవానికి మూలం ఏది? అనే ప్రశ్నకు ఇప్పటికీ నిర్దిష్టమై సమాధానం లేదు. ఈ రహస్యాన్ని చేధించేందుకు గత కొన్ని శతాబ్దాలుగా నిరంతరాయంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో సిద్ధాంతాలు తెరపైకి వచ్చి కొత్త సమాచారం తెలిసినప్పటికీ జీవానికి మూలం ఎక్కడనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదు.
ఈ సంవత్సరానికి రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు రానున్నాయి. ఇవి సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వెళుతున్నప్పుడు మూడు గ్రహాలు ఒకే కక్షలో ఉన్నప్పుడు సంభవిస్తాయట. సూర్యుడు భూమి నీడను చంద్రుని పై వేసినపుడు చంద్రగ్రహణం జరుగుతుంది. ఒకే సరళరేఖ మీద ఇవి కనిపిస్తాయి.
ఆకాశంలో అద్భుతం జరుగుతోంది. జెమినిడ్స్ ఉల్కాపాతం కనువిందు చేస్తోంది. ఆకాశం నుంచి భూమిపైకి రాలే తోక చుక్కలను చూడడానికి ప్రజలంతా తెగ ఆసక్తి చూపుతున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటలకు ఈ వరకు ఈ తోక చుక్కలను చూడవచ్చు.
ప్రజలకు హై అలర్ట్. 22 అణుబాంబు(Nuclear Bomb)ల శక్తితో సమానమైన ఓ గ్రహశకలం(Asteroid) భూమిని ఢీ కొట్టబోతోంది. నిజమేనండీ.. స్వయాన నాసా సైంటిస్టులే(NASA Scientist) ఈ విషయం వెల్లడించారు. నాసాకు చెందిన OSIRIS-REx సైన్స్ బృందం ప్రకటించిన వివరాల ప్రకారం.. 1999 లో తొలి సారి కనుక్కున్న ఉల్క భూమి వైపు క్రమంగా దూసుకొస్తోంది.
భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు. 98 ఏళ్ల వయసున్న స్వామినాథన్ చెన్నైలోని ఆయన నివాసంలో ఈ రోజు తుది శ్వాస విడిచారు.