వెల్స్ ఫార్గో చెన్నై జీసీసీ మూసివేత
ABN, Publish Date - May 09 , 2025 | 04:37 AM
అమెరికా ఆర్థిక సేవల కంపెనీ వెల్స్ ఫార్గో చెన్నైలోని తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను మూసివేయనుంది. భారత కార్యకలాపాల దశల వారీ పునర్వ్యవస్థీకరణ లో...
చెన్నై: అమెరికా ఆర్థిక సేవల కంపెనీ వెల్స్ ఫార్గో చెన్నైలోని తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను మూసివేయనుంది. భారత కార్యకలాపాల దశల వారీ పునర్వ్యవస్థీకరణ లో భాగంగా ఈ కేంద్రాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) చివరి త్రైమాసికానికల్లా పూర్తిగా మూసివేయాలని కంపెనీ నిర్ణయించింది. అందులో పనిచేస్తున్న సిబ్బందిని బెంగళూరు లేదా హైదరాబాద్లోని తన కార్యాలయాలకు బదిలీ కావాలని కోరింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలోని వెల్స్ ఫార్గో కార్యాలయాల్లో దాదాపు 10,000 మంది పనిచేస్తున్నారు. అందులో ఎంత మంది చెన్నై కార్యాలయంలో పనిచేస్తున్నారన్న విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
ఈ వార్తలు కూడా చదవండి
Operation Sindoor: జమ్మూకాశ్మీర్లో పాక్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి
Operation Sindoor: రాజస్థాన్, పంజాబ్లో హై అలర్ట్.. సిద్ధమైన క్షిపణులు..
Iran FM Seyed Araghchi: ఇండియా, పాక్ ఉద్రిక్తత వేళ ఇండియాకు ఇరాన్ మంత్రి
Pakistan: లాహోర్లో పేలుళ్లు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..
Read Latest International News And Telugu News
Updated Date - May 09 , 2025 | 04:37 AM