Pakistan: లాహోర్లో పేలుళ్లు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..
ABN , Publish Date - May 08 , 2025 | 10:00 AM
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ లాహోర్లో పేలుళ్లు సంభవిచండంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. మొత్తం మూడు పేలుళ్లు సంభవిచండంతో అధికారులు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాన్ని మూసేశారు.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ లాహోర్లో పేలుళ్లు సంభవిచండంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. మొత్తం మూడు పేలుళ్లు సంభవిచండంతో అధికారులు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాన్ని మూసేశారు.
పాకిస్తాన్ (Pakistan) లాహోర్ వాల్టన్ రోడ్లోని సైనిక విమానాశ్రయం వెలుపల గురువారం వరుసగా మూడు పేలుళ్లు (Explosions) సంభవించాయి. తర్వాత సైరల్ మూగడంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పేలుళ్ల దాటికి భవనం నుంచి నల్లటి పొగ వెలువడుతుండడంతో భయంతో జనం బయటికి పరుగులు తీశారు. ముందు జాగ్రత్త చర్యగా వాల్టన్ రోడ్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాహోర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. పాకిస్తాన్ వైమానిక దళం (PAF) శిక్షణా విన్యాసాల సమయంలో పేలుళ్లు సంభవించాయని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.