Stock Market: రెండ్రోజుల లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్
ABN, Publish Date - May 27 , 2025 | 04:15 PM
అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ప్రభావం రెండ్రోజుల లాభాలకు బ్రేక్ వేసింది. హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాలతో పాటు ఆటో, ఎఫ్ఎమ్సీజీ, ఐటీ రంగాల నష్టాలు సూచీలను కిందకు లాగాయి. ప్రస్తుతం వెలువడుతున్న త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి.
గత రెండు సెషన్లలో భారీగా లాభపడిన దేశీయ సూచీలు కిందకు దిగి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ప్రభావం రెండ్రోజుల లాభాలకు బ్రేక్ వేసింది. హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాలతో పాటు ఆటో, ఎఫ్ఎమ్సీజీ, ఐటీ రంగాల నష్టాలు సూచీలను కిందకు లాగాయి. ప్రస్తుతం వెలువడుతున్న త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ మంగళవారం నష్టాల బాట పట్టాయి (Business News).
సోమవారం ముగింపు (82, 176)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 150 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత ఆ నష్టాలు మరింత పెరిగాయి. ఒక దశలో 1000 పాయింట్లకు పైగా కోల్పోయి 81, 121 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు 624 పాయింట్ల నష్టంతో 81, 551 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. 174 పాయింట్ల నష్టంతో 24, 826 వద్ద రోజును ముగించింది. మళ్లీ 25 వేల మార్క్ దిగువకు పడిపోయింది.
సెన్సెక్స్లో సుప్రీమ్ ఇండస్ట్రీస్, కంటైనర్ కార్పొరేషన్, జియో ఫైనాన్షియల్స్, టిటాగర్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అల్ట్రాటెక్, ఐటీసీ, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, బీఎస్ఈ లిమిటెడ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 87 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 219 పాయింట్లు కోల్పోయింది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.33గా ఉంది.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్ను ఓవర్ టేక్ చేసిన వైనం
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్లో ఐఫోన్లు తయారు చేస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 27 , 2025 | 04:15 PM