Home » Stock Market
ఎఫ్ఎమ్సీజీ సెక్టార్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడం సూచీలపై ఒత్తిడి పెంచింది. అయితే కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో టెలికాం సెక్టార్ లాభాలను ఆర్జించింది. అలాగే డాలర్లో పోల్చుకుంటే రూపాయి నష్టపోవడం కూడా సూచీలను వెనక్కి లాగింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్గా రోజును ముగించాయి.
స్టీల్ స్టాక్స్ భారీ లాభాలను అందుకోవడం సూచీలకు కలిసొచ్చింది. అలాగే క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం, కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు మార్కెట్లను ముందుకు నడిపాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో రోజును ముగించాయి.
2025లో ట్రంప్ ప్రతికార సుంకాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, రూపాయి పతనం వంటి పలు ఇతర సమస్యలు దేశీయ స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ఇన్ని ప్రతికూలతల నడుమ కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు మదుపర్లకు లాభాలనే అందించాయి.
ఆటో, మెటల్ రంగాలపై చాలా మంది ఆసక్తిగా ఉండడం దేశీయ సూచీలకు కలిసొచ్చింది. అలాగే డాలర్తో పోల్చుకుంటే రూపాయి కాస్త కోలుకోవడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కూడా మార్కెట్లను ముందుకు నడిపాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల నుంచి కోలుకుని ఫ్లాట్గా రోజును ముగించాయి
గత సెషన్లో విదేశీ మదుపర్లు మాత్రం రూ.317 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. అలాగే సంవత్సరాంతం కావడంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించి కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్లను వెనక్కి లాగాయి.
వరుసగా మూడు సెషన్ల పాటు కొనుగోళ్లకు మొగ్గు చూపిన విదేశీ మదుపర్లు మంగళవారం మాత్రం రూ.1794 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. అలాగే ఐటీ, ఫార్మా, ఆయిల్ రంగాల్లో లాభాల స్వీకరణ జరిగింది. ఇక, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా కూడా సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి.
గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగతూ వస్తున్న ఐటీ రంగంలో లాభాల స్వీకరణ జరిగింది. హెవీ వెయిట్ ఐటీ కంపెనీల్లో లాభాల స్వీకరణ సూచీలను వెనక్కి లాగింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్గా రోజును ముగించాయి.
2026లో అమెరికా ఫెడ్ రిజర్వ్ రెండు సార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తుందని వెలువడుతున్న అంచనాలు మదుపర్లలో పాజిటివ్ సెంటిమెంట్ను పెంచాయి. అలాగే డాలర్తో పోల్చుకుంటే రూపాయి బలపడుతుండడం, ఐటీ రంగ షేర్లపై ఆసక్తి, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు సూచీలను ముందుకు నడిపించాయి.
డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీనికి తోడు వారాంతపు సెలవులు కూడా ఉండటంతో ట్రేడర్లు తమ పొజిషన్లను, సెటిల్మెంట్లను ఈ సెలవు దినాలను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
వరుసగా నాలుగు రోజులు నష్టాలనే చవిచూసిన సెన్సెక్స్ శుక్రవారం కోలుకుంది. భారీ లాభాలతో రోజును ముగించింది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి కాస్త బలపడింది. అలాగే, విదేశీ సంస్థాగత మదుపర్ల గురువారం రూ. 600 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.