Home » Stock Market
వరుసగా మూడు సెషన్ల పాటు కొనుగోళ్లకు మొగ్గు చూపిన విదేశీ మదుపర్లు మంగళవారం మాత్రం రూ.1794 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. అలాగే ఐటీ, ఫార్మా, ఆయిల్ రంగాల్లో లాభాల స్వీకరణ జరిగింది. ఇక, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా కూడా సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి.
గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగతూ వస్తున్న ఐటీ రంగంలో లాభాల స్వీకరణ జరిగింది. హెవీ వెయిట్ ఐటీ కంపెనీల్లో లాభాల స్వీకరణ సూచీలను వెనక్కి లాగింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్గా రోజును ముగించాయి.
2026లో అమెరికా ఫెడ్ రిజర్వ్ రెండు సార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తుందని వెలువడుతున్న అంచనాలు మదుపర్లలో పాజిటివ్ సెంటిమెంట్ను పెంచాయి. అలాగే డాలర్తో పోల్చుకుంటే రూపాయి బలపడుతుండడం, ఐటీ రంగ షేర్లపై ఆసక్తి, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు సూచీలను ముందుకు నడిపించాయి.
డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీనికి తోడు వారాంతపు సెలవులు కూడా ఉండటంతో ట్రేడర్లు తమ పొజిషన్లను, సెటిల్మెంట్లను ఈ సెలవు దినాలను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
వరుసగా నాలుగు రోజులు నష్టాలనే చవిచూసిన సెన్సెక్స్ శుక్రవారం కోలుకుంది. భారీ లాభాలతో రోజును ముగించింది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి కాస్త బలపడింది. అలాగే, విదేశీ సంస్థాగత మదుపర్ల గురువారం రూ. 600 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, అమెరికా మార్కెట్లలో నష్టాలు, ఆసియాలోని ఇతర దేశాల మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉండడం దేశీయ సూచీలకు నెగిటివ్గా మారింది. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా సూచీలు నష్టాలతోనే ముగిశాయి.
డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ పడిపోతుండడం, విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్లను వెనక్కి లాగాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడో రోజు కూడా నష్టాలతో ముగిశాయి.
దేశంలో నిత్యావసర వస్తువుల తక్షణ డెలివరీ సంస్థ అయిన జెప్టో త్వరలో ఐపీవోకు రాబోతోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా 4వేల కోట్ల రూపాయలు సేకరించాలని నిర్దేశించుకుంది.
సోమవారం విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.1, 468 కోట్లు విలువైన షేర్లు అమ్మేశారు. విదేశీ సంస్థాగత మదుపర్లు గత పన్నెండు రోజులుగా విక్రయాలు జరుపుతున్నారు. ఇది కూడా నెగిటివ్గా మారింది. అలాగే అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్లను వెనక్కి లాగాయి.
ఉదయం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్టంతో పోల్చుకుంటే 400 పాయింట్లు పైకి వచ్చాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం, ఎఫ్ఎమ్సీజీ షేర్లపై ఆసక్తి సూచీలకు ఊరట కలిగించింది.