Vice Chancellor Appointment: నాలుగు యూనివర్సిటీలకు మళ్లీ సెర్చ్ కమిటీలు
ABN, Publish Date - Jul 04 , 2025 | 04:48 AM
నాలుగు యూనివర్సిటీల్లో వైస్ చాన్స్లర్ల నియామకానికి ఉన్నత విద్యాశాఖ మళ్లీ సెర్చ్ కమిటీలను నియమించింది. ఆచార్య నాగార్జున, జేఎన్టీయూ-విజయనగరం, ద్రవిడియన్, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలకు...
రెండు నెలల్లో వీసీల నియామకానికి చర్యలు
అమరావతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): నాలుగు యూనివర్సిటీల్లో వైస్ చాన్స్లర్ల నియామకానికి ఉన్నత విద్యాశాఖ మళ్లీ సెర్చ్ కమిటీలను నియమించింది. ఆచార్య నాగార్జున, జేఎన్టీయూ-విజయనగరం, ద్రవిడియన్, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలు నియమిస్తూ ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ గురువారం ఉత్తర్వులిచ్చారు. రెండు నెలల్లో కొత్త వీసీలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా తొమ్మిది యూనివర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్నిటికీ రెండు నెలల్లో కొత్త వీసీలను నియమించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
Updated Date - Jul 04 , 2025 | 04:50 AM