ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Veerayya Chowdary: ఆధిపత్యపోరువల్లే వీరయ్య హత్య

ABN, Publish Date - May 15 , 2025 | 04:17 AM

టీడీపీ నేత వీరయ్యచౌదరి హత్య అధిపత్య పోరుతో సంబంధముందని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఇసుక వ్యాపార విషయంలో తలెత్తిన శత్రుత్వమే హత్యకు దారితీసిందని పేర్కొన్నారు.

వివరాలు వెల్లడించిన ప్రకాశం ఎస్పీ దామోదర్‌

ఒంగోలు, మే 14 (ఆంధ్రజ్యోతి): ఆధిపత్య పోరులో భాగంగానే టీడీపీ నేత ముప్పవరపు వీరయ్యచౌదరి హత్య జరిగిందని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ తెలిపారు. ఈ కేసులో మొత్తం 12మందిని నిందితులుగా గుర్తించి, వారిలో తొమ్మిది మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. వీరయ్య చౌదరిని గత నెల 22న ఒంగోలులోని ఆయన కార్యాలయంలో దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. ఈ కేసు వివరాలను ఎస్పీ దామోదర్‌ మీడియాకు వివరించారు. వీరయ్య స్వగ్రామమైన అమ్మనబ్రోలులో ఆయన ప్రత్యర్థి వర్గానికి చెందిన ఆళ్ల సాంబయ్య అలియాస్‌ సిద్ధాంతిని ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా గుర్తించామని ఎస్పీ తెలిపారు. మొత్తం ఆపరేషన్‌ను ఒంగోలుకు చెందిన వినోద్‌ అనే ఇసుక వ్యాపారి నడిపించారన్నారు. ఇసుక వ్యాపారాన్ని వీరయ్యచౌదరి అడ్డుకున్నారనే కోపంతో ఉన్న వినోద్‌.. ఆయన హత్యకు ఆళ్ల సాంబయ్యతో కలిసి ప్రణాళిక రచించారని చెప్పారు. కాగా, మంత్రి లోకేశ్‌ వీరయ్యచౌదరి కుటుంబాన్ని గురువారం పరామర్శించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 04:17 AM