ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revenue dept : ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పాస్‌ పుస్తకాలు

ABN, First Publish Date - 2025-02-12T03:59:52+05:30

రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర ఉన్న కొత్త పాసుపుస్తకాలను ఏప్రిల్‌ 1 నుంచి పంపిణీ చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది.

  • మార్చి నాటికి సర్వేరాళ్లపై జగన్‌ బొమ్మలు తొలగింపు

ABN AndhraJyothy : రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర ఉన్న కొత్త పాసుపుస్తకాలను ఏప్రిల్‌ 1 నుంచి పంపిణీ చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. భూముల రీసర్వే జరిగిన 8,680 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పేరిట ఇచ్చిన పాసుపుస్తకాలను వెనక్కి తీసుకొని, వాటిస్థానంలో కొత్తగా ముద్రించిన పుస్తకాలను ఇవ్వనుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబుకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ నివేదించారు. పాసుపుస్తకాలపై జగన్‌ బొమ్మలు ఉండటంతో వాటిని రైతులు తిరస్కరిస్తున్నారని చెప్పారు. మార్చి నాటికి సర్వేరాళ్లపై జగన్‌ బొమ్మలు, పేర్లు తొలగించే కార్యక్రమం కూడా పూర్తవుతుందని తెలిపారు. రెవెన్యూ సదస్సులు, రీసర్వే గ్రామాల్లో జరిగిన సభల్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఈ నెలాఖరు నాటికి పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు. ల్యాండ్‌ గ్రాబింగ్‌ నిరోధక చట్టం కేంద్రం పరిశీలనలో ఉందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పి. సిసోడి యా వెల్లడించారు. కేంద్రం ఆ చట్టాన్ని త్వరగా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భూముల అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటుకు త్వర లో ఉత్తర్వులు జారీ చేస్తామని, ఇప్పటికే సీసీఎల్‌ఏ మార్గదర్శకాలు ఇచ్చారని సిసోడియా వివరించారు.

Updated Date - 2025-02-12T03:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising