Home » Amaravati farmers
రాష్ట్ర రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. తలసరి రుణ భారంలో రాష్ట్ర రైతులు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో ఒక్కో రైతు కుటుంబంపై రూ.2,45,554 అప్పు పేరుకుంది.
ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తే ఏం చేస్తామో క్లారిటీ ఇస్తూ వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. మా నమ్మకం నువ్వే జగన్ పేరిట విడుదల చేసిన మేనిఫెస్టోలో గతంలో ఇచ్చిన హామీలనే మరోసారి పేర్కొంటూ.. పెన్షన్ను 2028లో రూ.250, 2029లో మరో రూ.250 చొప్పున ఐదో ఏడాదికి రూ.3,500కు పెంచుతామని హామీ ఇచ్చారు. పాత హామీలకే రంగులద్ది కొత్త మేనిఫెస్టోలో చేర్చారు.
అమరావతి ప్రాంత రైతుల ఉద్యమం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రైతు పోరాటమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(NV Ramana) అన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు గత టీడీపీ ప్రభుత్వానికి భూమి ఇచ్చారని తెలిపారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు నేరం చేయలేదని.. కానీ జగన్ ప్రభుత్వం వారిపై దమనకాండ సాగించడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజధాని అమరావతి ఉద్యమానికి ఎన్నికల సంఘం ఆదేశాలు పోలీసుల సూచనమేరకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్టు సమన్వయ కమిటీ, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తెలిపింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. అమరావతి ఉద్యమకారులకు, మహిళలకు, రైతులకు, రైతు కూలీలకు, దళిత, మైనారిటీ జేఏసీ సభ్యులకు, లీగల్ అండ్ ఫైనాన్స్ కమిటీ సభ్యులకు, శిబిర నిర్వాహకులకు ఈ మేరకు ఐక్య కార్యాచరణ సమితి నుంచి ఆదేశాలు అందాయి.
Andhrapradesh: రాజధాని అమరావతిపై జగన్ ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరలేపింది. ఎన్నికల నోటిఫికేషన్కు రెండు రోజులు ముందు భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఈ మేరుకు గుంటూరు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ రద్దుతో రాజధాని మాస్టర్ ప్లాన్పై తీవ్ర ప్రభావం పడనుంది. 21 రెవెన్యూ గ్రామాల్లో 625 ఎకరాల సేకరణ పరిధి నుంచి మినహాయింపు రానుంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెన్షన్ల పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.
Chandrababu Naidu: ఐదేళ్లుగా మూడు రాజధానుల జపం చేసిన వైసీపీ సర్కార్.. ఇప్పుడు నాలుగవ రాజధాని పేరు ప్రస్తావిస్తోందని చంద్రబాబు విమర్శించారు. కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఈ ఐదేళ్లు విధ్వంసం కాదు.. అరాచకం జరిగిందన్నారు.
Andhrapradesh: అమరావతి కేసుల విచారణను సుప్రీం కోర్టు ఏప్రిల్కు వాయిదా వేసింది. ఏప్రిల్లో సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. అమరావతే రాజధాని అంటూ గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వగా.. ఆ తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.
ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మీపై అమరావతి రైతులు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రాజధాని అమరావతిలో భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లింపుపై హైకోర్టులో విచారణ జరిగింది.