Ration Vehicle Insurance: రేషన్ వాహనాలకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించండి
ABN, Publish Date - Apr 17 , 2025 | 05:40 AM
రేషన్ వాహనాలపై ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఈ ఏడాది కూడా ప్రభుత్వం చెల్లించాలని ఎండీయూ ఆపరేటర్లు మంత్రి నాదెండ్ల మనోహర్కు వినతి చేశారు. గత నాలుగేళ్లుగా చెల్లించిన విధంగా ఈసారి కూడా అదే కొనసాగించాలని కోరారు
మంత్రి నాదెండ్లకు ఎండీయూ ఆపరేటర్ల వినతి
అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): రేషన్ వాహనాలకు నాలుగేళ్లుగా చెల్లిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం సొమ్మును చెల్లించాలని ఎండీయూ ఆపరేటర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఎండీయూ ఆపరేటర్ల అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను, కమిషనర్ సౌరభ్ గౌర్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండీ జిలానీ సమూన్లను కలిసి వినతిపత్రాలు అందజేశారు.
Updated Date - Apr 17 , 2025 | 05:40 AM