ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: లోకేష్‌కు తల్లికి వందనం జీవోలు అందజేసిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Jun 12 , 2025 | 12:41 PM

CM Chandrababu: ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తల్లికి వందనం జీవోలను మంత్రి లోకేష్‌కు అందజేశారు సీఎం.

CM Chandrababu Naidu

అమరావతి, జూన్ 12: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తైన సందర్భంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈరోజు (గురువారం) విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు (Minister Lokesh) తల్లికి వందనం జీవోలను సీఎం చంద్రబాబు (CM Chandrababu) అందజేశారు. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనపై మంత్రి లోకేష్‌తో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం ఎన్డీయేకు రెండు కళ్ళన్నారు. సంపద సృష్టిస్తామని.. సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని ముందుకెలా తీసుకెళ్తారని చాలా మంది ప్రశ్నించారన్నారు.

సూపర్ సిక్స్‌లో అతి కీలకం తల్లికి వందనం అని అన్నారు. ఒకరికి ఇచ్చి.. మిగిలిన వాళ్లకి ఇవ్వకపోవడం కరెక్ట్ కాదని భావించామని.. అందుకే ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. గత ప్రభుత్వం సుమారు 42 లక్షల మందికి అమ్మ ఒడి ఇచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం సుమారు 67 లక్ష మందికి తల్లికి వందనం ఇస్తున్నామని తెలియజేశారు. తల్లి తండ్రులు లేని పిల్లలకు గార్డియన్ ఖాతాలో వేస్తున్నామన్నారు. పారదర్శకత కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్దిదారుల జాబితా పెడతామని తెలిపారు. ఏమైనా సాంకేతిక ఇబ్బందులుంటే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 26వ తేదీ వరకు గడువు ఉందని.. ఈ నెల 30వ తేదీన తుది జాబితా ప్రకటిస్తామని చెప్పారు. ఏ మాట అయితే చెప్పానో.. దాన్ని అమలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

సీఎం చమత్కారం.. లోకేష్ నవ్వులు

ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటేనే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత పెట్టాల్సి వస్తుందని ఈ సందర్భంగా సీఎం చమత్కరించగా.. పక్కనే నవ్వుతూ కనిపించారు లోకేష్. అన్నదాత సుఖీభవ పథకం కింద వైసీపీ ప్రభుత్వం కంటే రూ.6 వేల రూపాయలు ఎక్కువ ఇస్తున్నామన్నారు. పెన్షన్ కూడా ఒకేసారి వెయ్యి పెంచి రూ.4 వేలు ఇస్తున్నామన్నారు. బటన్ నొక్కుతున్నామని మాయమాటలు చెప్పే పెద్దలకు ఇది అర్థం కావాలంటూ పరోక్షంగా జగన్‌పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకువచ్చారన్నారు. ఎమ్మార్వో ఆఫీసులు తాకట్టు పెట్టారన్నారు. ఆర్థిక వ్యవస్థను జగన్ విధ్వంసం చేశారని.. అభివృద్ధిని గాలికి వదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఈ ఏడాదిలో సుపరిపాలనను చేపట్టి వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు. 20 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఆడబిడ్డ నిధిని పీ4కు అనుసంధానం చేస్తామన్నారు. ఇబ్బందులు చాలా ఉన్నాయని.. రాక్షసుల మాదిరిగా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని మండిపడ్డారు. తానెప్పుడూ చూడని ఆకృత్యాలకు పాడుతున్నారన్నారు. గంజాయి, డ్రగ్స్‌కు ఎడిక్ట్ అయిన వారు చాలా మంది ఉన్నారన్నారు. అలాంటి వారికి, నేరస్థులకు వైసీపీ అండగా ఉంటోందని సీఎం ఆరోపించారు.

నేనెవరికీ భయపడను.. తోక జాడిస్తే వదల

‘బాబాయ్‌ను చంపి నా చేతిలో కత్తి పెట్టే ధైర్యం, పత్రికల్లో వేసే ధైర్యం ఎలా వచ్చింది. తెనాలిలో గంజాయి, రౌడీలకు వెళ్లి మద్దతు ఇస్తారా? అమరావతి దేవతల రాజధాని అయితే వేశ్యల రాజధాని అంటారా? ఒళ్ళు కొవ్వెక్కి ఇటువంటి చర్యలు చేస్తున్నారు. నాకు పబ్లిక్ సేఫ్టీ చాలా ముఖ్యం. రౌడీలను, తీవ్రవాదులను, ఫ్యాక్షనిస్ట్‌లను, మత కల్లోలాలను అణచి వేశాను. నేను ఎవరికీ భయపడను. ఇంత వరకు నా మంచితనం చూశారు. ఇక ముందు తోక జాడిస్తే మాత్రం వదిలిపెట్టను. ఈ నెల 20న అన్నదాత సుఖీభవ పథకం ఇస్తున్నాం. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నాం. 11 సీట్లతో బుద్ధి చెప్పినా కూడా బుద్ధి లేకుండా ఎలా వ్యవహరిస్తున్నారు అనేది కూడా త్వరలో చూపిస్తాము’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

జోడెడ్ల బండిలా అభివృద్ధి, సంక్షేమం: లోకేష్

విద్వంసం నుంచి వికాస పాలనకు ఏడాది పూర్తి అయ్యిందని మంత్రి లోకేష్ అన్నారు. మెగా డీఎస్సీని ఆపాలని ప్రతిపక్షం 24 కేసులు వేసిందన్నారు. ఈ రోజు చివరి కేసు కొట్టేశారని తెలిపారు. డొమెస్టిక్ పెట్టుబడులలో ఏపీ నెంబర్ వన్‌గా ఉందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ రూ. 4 వేలు చేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. దీపం పథకం ద్వారా 2 కోట్ల గ్యాస్ సిలిండర్‌లు మహిళలకు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు తల్లికి వందనం డబ్బు జమ చేస్తున్నామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నగదు వేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి జోడెడ్ల బండి లాగా సాగుతాయన్నారు. 60 శాతం మంది కుటుంబాలకు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తిపై సీఎం చంద్రబాబు ట్వీట్

మామా అన్నాడని దాడి.. కావాలిలో వైసీపీ నేత దాష్టీకం

Read latest AP News And Telugu News

Updated Date - Jun 12 , 2025 | 01:53 PM