Music Night: యుఫోరియా మ్యూజికల్ నైట్.. ఉర్రూతలూగిస్తున్న తమన్..
ABN, First Publish Date - 2025-02-15T19:30:02+05:30
ఆంధ్రప్రదేశ్: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ నైట్ ప్రారంభం అయ్యింది. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిర్వహిస్తున్నారు.
అమరావతి: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో "యుఫోరియా మ్యూజికల్ నైట్" (Euphoria Musical Night) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ (Music Director Thaman) ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ స్టార్ట్ అయ్యింది. ముఖ్య అతిథిలుగా సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, సినీ నటుడు బాలకృష్ణ హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి .. ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.
తలసేమియా వ్యాధి గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రేక్షకులు హాజరయ్యారు. తలసేమియా బాధితుల కోసం భువనేశ్వరి చేపట్టిన మ్యూజిక్ నైట్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీని ద్వారా వచ్చే నగదును తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం భువనేశ్వరి వినియోగించనున్నారు. కాగా, తమన్ తన పాటలతో ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్నారు. తన టీమ్తో కలిసి తమన్ చేస్తున్న హంగామా శ్రోతలను కట్టిపడేస్తోంది.
మ్యూజికల్ నైట్ లైవ్ స్ట్రీమింగ్ ఇక్కడ చూడొచ్చు..
ఈ వార్తలు కూడా చదవండి:
Vallabhaneni Vamsi: మిస్సైన వల్లభనేని వంశీ ఫోన్.. అసలు విషయం ఇదే..
CM Chandrababu: ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్..
Updated Date - 2025-02-15T20:10:41+05:30 IST