Visakhapatnam: నౌకాదళంలోకి ఐఎన్ఎస్ నీలగిరి
ABN, Publish Date - Jun 23 , 2025 | 06:37 AM
తూర్పు నౌకాదళంలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ముంబైలో తయారైన యుద్ధనౌక ‘ఐఎన్ఎ్స నీలగిరి’ ఆదివారం తూర్పు నౌకాదళంలోకి వచ్చింది.
విశాఖ చేరిన అత్యాధునిక యుద్ధ నౌక
తూర్పు నౌకాదళంలోకి ‘ఐఎన్ఎస్ నీలగిరి
విశాఖ చేరిన అత్యాధునిక యుద్ధ నౌక
విశాఖపట్నం, జూన్ 22(ఆంధ్రజ్యోతి): తూర్పు నౌకాదళంలోకి మరో అత్యాధునిక యుద్ధ నౌక చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ముంబైలో తయారైన యుద్ధనౌక ‘ఐఎన్ఎ్స నీలగిరి’ ఆదివారం తూర్పు నౌకాదళంలోకి వచ్చింది. ఈ సందర్భంగా స్థానిక తూర్పు నౌకాదళం అధికారులు ఘనస్వాగతం పలికారు. ప్రాజెక్టు 17ఏ స్టెల్త్ ఫ్రిగేట్స్ శ్రేణిలో ఈ యుద్ధ నౌకను నిర్మించారు. ఈ తరహా శ్రేణిలో నిర్మించిన తొలి నౌక ఇదే కావడం గమనార్హం. ముంబై నావల్ డాక్ యార్డులో ఈ ఏడాది జనవరి 15న జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఐఎన్ఎస్ నీలగిరిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇప్పుడు ఈ యుద్ధ నౌక రాకతో తూర్పు నౌకాదళం మరింత బలోపేతం కానుంది.
Updated Date - Jun 23 , 2025 | 06:37 AM