Liquor Trace Plan: ఎక్సైజ్లో ట్రాక్ విధానంపై కమిటీ
ABN, Publish Date - Apr 29 , 2025 | 04:52 AM
Telugu Summary: మద్యం సీసాల ట్రాక్ అండ్ ట్రేస్ విధానానికి సంబంధించి ఏపీలో ఎక్సైజ్ శాఖ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ 15 రోజుల్లో నివేదికను సమర్పించనుంది
అమరావతి, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): మద్యం సీసాల ట్రాక్ అండ్ ట్రేస్, ఇంటిగ్రేటెడ్ ఎక్సైజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలుకు ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ ఎక్సైజ్ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో ఎక్సైజ్ డైరెక్టర్, పరిశ్రమల శాఖ అదనపు డైరెక్టర్, ఆర్థిక శాఖ అదనపు డైరెక్టర్, ఐటీ శాఖ డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు. 15 రోజుల్లో ఈ కమిటీ నివేదిక సమర్పించనుంది.
Updated Date - Apr 29 , 2025 | 04:53 AM