Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వం మోసగించింది
ABN, Publish Date - May 17 , 2025 | 04:01 AM
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ ప్రభుత్వం ఏ సంవత్సరం రూ.1.59 లక్షల కోట్ల ఖర్చు చేసి, సంక్షేమ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. రైతుల సమస్యలపై వైసీపీ త్వరలో పోరాటం చేయనుందని చెప్పారు.
ఇచ్చిన హామీలను విస్మరించింది
త్వరలో వైసీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళన: బొత్స
కాకినాడ, మే 16(ఆంరఽధజ్యోతి): ‘దేశ చరిత్రలో ఏ రాష్ట్రమూ రూ.1.59 లక్షల కోట్లను ఏడాదిలోపు ఖర్చు చేయలేదు. అలాంటిది ఏపీ ప్రభుత్వం ఎలా చేసింది?’ అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ‘మేం అధికారంలో ఉన్నప్పుడు డీబీటీ ద్వారా కోట్లాది రూపాయలను ప్రజలకు నేరుగా అందించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఏ సంక్షేమ పథకాలకూ ఇవ్వకుండా అంత మొత్తం దేనికి ఖర్చు చేశారో? ఏ గుత్తేదారుకు ఇచ్చారో చెప్పాలి. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని రంగాల ప్రజలను మోసం చేసింది. సూపర్ సిక్స్, అమ్మ ఒడి, రైతు భరోసా, సింగిల్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు... ఇవేవీ ప్రజలకు కనిపించట్లేదు. ఎక్కడ చూసినా దోపిడీ, అవినీతే కనిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో వరి సాగు రైతులు క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులపై వైసీపీ పోరాడుతుంది. పండిన పంటకు రేటు ఇవ్వకపోగా, మిల్లర్లు, బియ్యం ఎగుమతుదారులు కుమ్మక్కై రైతులను దోపిడీ చేస్తున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పిన మాటలేవీ క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదు. ఒంగోలు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి వైసీపీ త్వరలోనే పోరాటం చేస్తుంది. ఆక్వా రైతుల సమస్యలపైనా క్షేత్రస్థాయిలో చర్చించి ఆందోళన చేపడతాం. రాష్ట్రంలోని రైతులకు వైసీపీ అండగా ఉంటుంది. ఇది మా పార్టీ అధ్యక్షుడు జగన్ మాట’ అని బొత్స తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News
Updated Date - May 17 , 2025 | 04:01 AM