Aparanji Poosarla: టైప్ 2 డయాబెటిస్ నిర్ధారణకు సెన్సార్
ABN, Publish Date - Apr 23 , 2025 | 04:40 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అపరంజి పూసర్ల తయారుచేసిన పోర్టబుల్ బయోసెన్సర్ టైప్ 2 డయాబెటిస్ నిర్ధారణ కోసం పేటెంట్ను పొందింది. ఈ సెన్సార్ రక్త నమూనాలు సేకరించాల్సిన అవసరం లేకుండా చెమట, లాలాజలం నమూనాలతో వ్యాధులను త్వరగా గుర్తించగలుగుతుంది.
ఏయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అపరంజి పూసర్ల ఆవిష్కరణ
విశాఖపట్నం, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం బయో కెమిస్ర్టీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అపరంజి పూసర్ల టైప్ 2 డయాబెటిస్ నిర్ధారణకు రూపొందించిన పోర్టబుల్ బయో సెన్సార్కు పేటెంట్ లభించింది. ఈ విభాగానికి లభించిన తొలి పేటెంట్ ఇదే కావడం గమనార్హం. రక్త నమూనా సేకరించాల్సిన అవసరం లేకుండానే డయాబెటిస్, ఇతర సంక్రమణ వ్యాధులను తొందరగా గుర్తించేందుకు ఈ పోర్టబుల్ బయోసెన్సార్ ఉపకరిస్తుందని ఉప కులపతి ఆచార్య జీపీ రాజశేఖర్కు అపరంజి వెల్లడించారు. రక్త నమూనాలకు బదులు చెమట, లాలాజలం నమూనాలను వేయడం ద్వారా మాలిక్యూల్స్ను గుర్తిస్తారు. వాటి ఆధారంగా వ్యాధిని నిర్ధారిస్తారు.
Also Read:
కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 23 , 2025 | 04:41 AM