Guntur market committee: గుంటూరు మిర్చి యార్డులో అవినీతిపై కొరడా
ABN, Publish Date - May 17 , 2025 | 03:59 AM
గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (మిర్చియార్డు)లో వైసీపీ పాలనలో రూ.347 కోట్ల అవినీతి దొరికింది. అధికారులు, ఉద్యోగులపై విచారణతో క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్నారు.
వైసీపీ హయాంలో రూ.347 కోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదిక
అధికారులు, ఉద్యోగుల పాత్రపై రిపోర్టు
చర్యలకు ఆదేశిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
అమరావతి/గుంటూరు, మే 16(ఆంధ్రజ్యోతి): గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (మిర్చియార్డు)లో వైసీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు బాధ్యులైన అధికారులు, ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో కుటుంబానికి నాలుగైదు మిర్చి యార్డులు లైసెన్సులు జారీ చేశారని, జీరో బిజినెస్, కటింగ్ బిజినెస్ వల్ల యార్డు ఆదాయం కోల్పోవటానికి ఉద్యోగులు కారణమనే ఫిర్యాదులతో విజిలెన్స్ విభాగం గతేడాది విచారణ జరిపి, సుమారు రూ.347 కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది. ఈ మేరకు సమగ్ర నివేదికను ప్రభుత్వానికి గత ఏడాది నవంబరులో అందజేసింది. నివేదిక ఆధారంగా మిర్చి యార్డు పూర్వపు కార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరెడ్డి, కె.శివారెడ్డి, సహాయ కార్యదర్శులు కె.జయరామిరెడ్డి, వి.ఆనంద్భాస్కర్, 11 మంది సూపర్వైజర్లు, ఇద్దరు జూనియర్ మార్కెటింగ్ సూపర్వైజర్లు, ఒక డ్రైవర్పై అభియోగాలు నమోదయ్యాయి. ఉమ్మడి విచారణలో భాగంగా ఈ 18 మందిపై క్రమశిక్షణ చర్యలతో పాటు జరిమానాలు విధించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News
Updated Date - May 17 , 2025 | 03:59 AM