ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Education Department: ఇంటర్‌ విద్యాశాఖపై అవినీతి ఆరోపణలు

ABN, Publish Date - Jun 25 , 2025 | 05:44 AM

ఇంటర్మీడియట్‌ విద్యాశాఖపై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. పలు పోస్టులకు పదోన్నతుల విషయంలో ముడుపులు డిమాండ్‌ చేశారనే అంశం ఏసీబీ విచారణకు దారితీసింది. తాజాగా కమిషనరేట్‌లోని ఓ సూపరింటెండెంట్‌ను ఏసీబీ అధికారులు విచారించారు.

  • పదోన్నతులకు ముడుపులపై ఫిర్యాదులు

  • సూపరింటెండెంట్‌ను విచారించిన ఏసీబీ

అమరావతి, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ విద్యాశాఖపై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. పలు పోస్టులకు పదోన్నతుల విషయంలో ముడుపులు డిమాండ్‌ చేశారనే అంశం ఏసీబీ విచారణకు దారితీసింది. తాజాగా కమిషనరేట్‌లోని ఓ సూపరింటెండెంట్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. ఇంటర్‌ విద్యాశాఖలో ఇటీవల పలువురికి పదోన్నతులు ఇచ్చారు. దీనికోసం ఓ సూపరింటెండెంట్‌ స్థాయి అధికారి నగదు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. బోధనేతర ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ దివ్యాంగ ఉద్యోగి లైబ్రేరియన్‌ నుంచి సదరు సూపరింటిండెంట్‌ రూ.లక్ష డిమాండ్‌ చేశారని తెలిసింది. దీనిలో భాగంగా తొలుత రూ.15 వేలు గూగుల్‌ పే ద్వారా తన ఖాతాలో వేయించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయినా పదోన్నతి రాకపోవడంతో ఆ ఉద్యోగి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఆ ఉద్యోగి తన సమస్యతోపాటు ఇతరుల ముడుపుల విషయాన్ని కూడా ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సోమ, మంగళవారాల్లో సూపరింటెండెంట్‌ను ఏసీబీ అధికారులు విచారణకు పిలిచారు. కొన్ని లావాదేవీలపై ఆయన గుర్తులేదని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను ఏసీబీ ఆరా తీసింది. కాగా, ఆ అధికారిపై ఇద్దరు మంత్రులు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Updated Date - Jun 25 , 2025 | 05:45 AM