Lorry Owners: సరిహద్దు చెక్ పోస్టులను తొలగించాలి
ABN, Publish Date - Jul 30 , 2025 | 05:06 AM
తమిళనాడు రాష్ట్ర సరిహద్దులో అనధికారికంగా కొనసాగుతున్న చెక్ పోస్టులను ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ లారీ
ఏపీ లారీ ఓనర్స్ సంఘం డిమాండ్.. తమిళనాడులో ధర్నా
విజయవాడ సిటీ, జూలై 29(ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాష్ట్ర సరిహద్దులో అనధికారికంగా కొనసాగుతున్న చెక్ పోస్టులను ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు డిమాండ్ చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఈ చెక్ పోస్టులను తొలగించాలంటూ.. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులోని గుమ్మడిపూ డి చెక్ పోస్ట్ వద్ద ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ మంగళవారం ధర్నా చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 70 మంది లారీ యజమానులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏపీ సహా కొన్ని రాష్ర్టాలు సరిహద్దు చెక్పోస్టులను తొలగించాయన్నారు. తమిళనాడు సహా మరికొన్ని రాష్ర్టాలు వీటిని అనధికారికంగా కొనసాగిస్తున్నాయని చెప్పారు. అనధికారికంగా ఉన్న చెక్ పోస్టులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్
Read latest AndhraPradesh News And Telugu News
Updated Date - Jul 30 , 2025 | 05:06 AM