Kidnapping Case: 28 వరకు వంశీ రిమాండ్ పొడిగింపు
ABN, Publish Date - May 15 , 2025 | 03:24 AM
ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో గన్నవరం MLA వంశీమోహన్తోపాటు మరో ఐదుగురికి ఏసీబీ కోర్టు రిమాండ్ను పొడిగించింది. ఈ కేసులో వంశీకి బెయిల్ వచ్చినా, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కిడ్నాప్ కేసులో ఏసీబీ కోర్టు ఆదేశాలు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్పై 16న తీర్పు
విజయవాడ, మే 14(ఆంధ్రజ్యోతి): ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో గన్నవరం మా జీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్తోపాటు మరో ఐదుగురికి ఏసీబీ కోర్టు రిమాండ్ను పొడిగించింది. ఈ కేసులో నిందితులకు రిమాండ్ పూర్తికావడంతో వారిని బుధవారం కోర్టులో హాజరు పరిచారు. వారి రిమాండ్ను ఈనెల 28 వరకు న్యాయాధికారి పి.భాస్కరరావు పొడిగించా రు. కాగా, ఈ కేసులో వంశీతో పాటు మరో నలుగురికి ఏసీబీ కోర్టు బెయి ల్ మంజూరు చేసినప్పటికీ ఇద్దరు మాత్రమే జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. ఈ కేసులో పోలీసులు వంశీతోపాటు గంటా వీర్రాజు, నిమ్మ చలపతి, వెలినేని శివరామకృష్ణప్రసాద్, వేలూరి వంశీబాబు, ఓలుపల్లి మోహనరంగారావు అలియాస్ రంగాను అరెస్టు చేశారు. వారిలో వెలినేని శివరామకృష్ణప్రసాద్ బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉండటంతో మిగిలిన ఐదురుగురికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా, గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును ఈనెల 16కి వాయిదా వేస్తూ 12వ ఏడీజే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో 71వ నిందితుడిగా ఉన్న వంశీకి బెయిల్ రాకపోవడంతో, సత్యవర్ధన్ కేసులో బెయిల్ వచ్చినా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News
Updated Date - May 15 , 2025 | 03:24 AM