ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, కుటమి నేతలు
ABN, Publish Date - May 13 , 2024 | 12:02 PM
అమరావతి: ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు కుటుంబ సభ్యులు ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్లో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి వచ్చి మంగళగిరిలో ఓటువేశారు. టీడీపీ నేత బాలకృష్ణ దంపతులు హిందూపురంలో ఓటు వేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులు ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్లో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్లో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న నారా లోకేష్, బ్రహ్మణి
నందమూరి బాలకృష్ణ దంపతులు హిందూపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న దృశ్యం.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన భార్య లెజినోవాతో కలిసి వచ్చి మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
విశాఖ జిల్లా, భీమిలి టీడీపీ అభ్యర్థి గంట శ్రీనివాసరావు తన ఓటు హక్కు వినియోగించుకుని మీడియాకు చూపుతున్న దృశ్యం.
రాజమండ్రిలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు బారులు తీరిన జనం..
Updated Date - May 13 , 2024 | 12:02 PM