Home » TDP - Janasena
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఐదవరోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్భంగా పత్రికలకు ప్రకటనలపై శాసనసభ దద్ధరిల్లింది. టీడీపీ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు పడిన కష్టాలు.. ప్రతిపక్షాలు ఎదుర్కొన్న హింసా రాజకీయాలు.. బాధితులే నిందితులైన ప్రభుత్వ టెర్రరిజాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ఆవిష్కరించారు. కట్టుతప్పిన శాంతి భద్రతలు, హత్యలు, అత్యాచారాలు, బెదిరింపులు, గంజాయి, డ్రగ్స్ దిగుమతితో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో వివరించారు. శాంతి భద్రతల విషయంలో నూతన అధ్యాయం ప్రారంభించబోతున్నామని చంద్రబాబు వెల్లడించారు. జగన్ హయాంలో జరిగిన అరాచకాలపై
టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల పంపకానికి అధినాయకత్వాలు సిద్ధమయ్యాయి. శ్రమ జీవులు, పోరాటాల వీరులకు న్యాయం జరిగే రోజులు వచ్చాయి. జాబితాల రూపలకల్పన ప్రక్రియ మొదలైంది. వైసీపీ హయాంలో ఎవరెవరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు..? పార్టీ కోసం ఎంతగా కష్టపడ్డారు..? ఎన్ని కేసులను భరిస్తున్నారు..? శ్రేణులకు ఏ స్థాయిలో ఉండగా నిలిచారు..? ఎలాంటి త్యాగాలు చేశారు..? ఈ ప్రశ్నలకు జవాబులే ప్రాతిపదికగా జాబితాలు తయారవుతున్నాయి. అందులో తమ పేరు ఉండాలని, కుర్చీ తమకే దక్కాలని ఆశావహులు ప్రయత్నాలను ప్రారంభించారు. ...
ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ క్యాడర్ పూర్తిగా డీలా పడింది. సానుకూల ఫలితాలు రాకపోవడంతో వైసీపీ అధినేత జగన్ (Y S Jagan) సైతం కొద్దిరోజుల పాటు చడీచప్పుడు లేకుండా సైలెంట్ అయిపోయారు.
సైకో పాలనలో అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు, పవన్ కల్యాణే ఇబ్బంది పడ్డారని, వారే అతిపెద్ద బాధితులని హోం మంత్రి అనిత అన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలే కాదు..
కాకినాడ జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రొయ్యల ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాల కాలుష్యంపై చర్యలకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ) చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.
జగన్ ఏలుబడిలో కొన్ని కీలక రంగాల్లో జరిగిన విధ్వంసంపై రూపొందిస్తున్న శ్వేతపత్రాలను అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ఏడు శ్వేతపత్రాలకు గాను నాలుగింటిని సీఎం చంద్రబాబు ఇప్పటికే విడుదల చేశారు.
విశాఖపట్నంలోని అత్యంత ఖరీదైన మధురవాడ ఐటీ హిల్స్ ప్రాంతంలో ఎన్సీసీకి కేటాయించిన భూమిని వైసీపీకి చెందిన కొందరు నేతలు బినామీ పేర్లతో స్వాధీనం చేసుకున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత ఇసుకను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తరలివచ్చి ఉచితాన్ని ఆరంభించారు. సర్కారు మధ్యంతర ఇసుక పాలసీని ప్రకటిస్తూ జీవో నం. 43ను జారీ చేసింది.
భారీ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజల తీర్పునకు అనుగుణంగా కనీసం దశాబ్దం పాటు తమ మైత్రి కొనసాగేలా చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్,....