హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకర యాత్రలో భాగంగా సోమవారం కర్నూల్లో పూలబజార్ నుండి కొండారెడ్డి బురుజు వరకు రోడ్ షో.. అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు. బాలయ్య సభకు జనం నీరాజనం పలికారు. యాత్రలో మహిళలు, మైనార్టీలు కిక్కిరిపోయారు. ఈ సందర్బంగా బాలయ్య మాట్లాడుతూ.. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. కర్నూలు తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపించాలని ప్రజలకు బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.