Weather Forecast: ఈశాన్య రుతుపవనాలు బలహీనం
ABN, Publish Date - Dec 23 , 2025 | 06:35 AM
ఈశాన్య రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. బంగాళాఖాతం నుంచి తూర్పుగాలులు రావ డం లేదు.
రాష్ట్రంలో పొడి వాతావరణం..కొనసాగుతున్న చలి
విశాఖపట్నం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఈశాన్య రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. బంగాళాఖాతం నుంచి తూర్పుగాలులు రావడం లేదు. దీంతో రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతోంది. వచ్చే ఐదారు రోజుల వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. కాగా కోస్తా, రాయలసీమల్లో చలి కొనసాగుతోంది. సోమవారం ఉదయం పొగమంచు కురిసింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టులో 7.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు, మూడు రోజులు చలి ప్రభా వం కొనసాగుతుందని, మంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
Updated Date - Dec 23 , 2025 | 06:35 AM