రామోజీ ఎక్స్లెన్స్ అవార్డ్స్ కార్యక్రమం ప్రారంభం..
ABN, Publish Date - Nov 16 , 2025 | 08:03 PM
రామోజీ ఎక్స్లెన్స్ అవార్డ్స్ కార్యక్రమం రామోజీ ఫిలిం సిటీలో ఇవాళ(ఆదివారం) సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
హైదరాబాద్: రామోజీ ఎక్స్లెన్స్ అవార్డ్స్ కార్యక్రమం రామోజీ ఫిలిం సిటీలో ఇవాళ(ఆదివారం) సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అలాగే ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా ఏడు రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు రామోజీ ఎక్స్లెన్స్ అవార్డులను ప్రధానం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామోజీ నిఘంటువులనూ విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Caste-based Violence: దారుణం.. తన కుమార్తెకు పెళ్లి చేశాడని..
MLC Kavitha: కర్మ హిట్స్ బ్యాక్ ట్వీట్పై స్పందించిన కవిత..
Updated Date - Nov 16 , 2025 | 08:03 PM