East Coast Maritime Logistics Conference : విశాఖలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Sep 02 , 2025 | 09:32 AM
విశాఖపట్నంలో ఇవాళ జరుగుతున్న ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ సదస్సులో 20 కంపెనీలకు చెందిన సీఈఓలతో..
విశాఖపట్నం, సెప్టెంబరు 2 : విశాఖపట్నంలో ఇవాళ జరుగుతున్న ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్ ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ సదస్సులో 20 కంపెనీలకు చెందిన సీఈఓలతో ఆయన సమావేశమవుతారు. మారిటైమ్ రంగానికి చెందిన ఆరు స్టార్ట్ప్ ల నిర్వాహకులతోను చంద్రబాబు సంభాషిస్తారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా మార్చేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని భావిస్తున్నారు. విశాఖలో ఎయిర్ కార్గో ఫోరం ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ను కూడా సీఎం ఇవాళ ప్రారంభిస్తారు.
Updated Date - Sep 02 , 2025 | 09:32 AM