Home » Visakhapatnam
తలసేమియా వ్యాధిగ్రస్తులకు అండగా నిలబడేందుకు విశాఖపట్నం వేదికగా రన్ నిర్వహించాలని ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్ణయించింది. అలాగే విశాఖపట్నంలో తలసేమియా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ ట్రస్ట్ సీఈవో ప్రకటించారు.
విశాఖ నగరంలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో ఆదివారం త్రీటౌన్ పోలీసులు ఓ వైద్యుడిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారిసంఖ్య మూడుకు పెరిగింది.
Anitha Dharmavaram Visit: ఇప్పుడు ఎన్నికలు లేవని - ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికి ధర్మవరం వచ్చినట్లు హోంమంత్రి అనిత చెప్పారు. ధర్మవరం గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో సర్పంచ్లకు అధికారాలు లేవని అన్నారు.
Anitha Temple Visit: పది రోజులు దశావతారంలో స్వామివారు ప్రజలందరికీ దర్శనభాగ్యం కల్పిస్తున్నారని హోంమంత్రి అనిత తెలిపారు. ప్రతి సంవత్సరం జగన్నాధ స్వామివారిని దర్శించుకోవడం తనకు ఆనవాయితీ అని వెల్లడించారు.
విశాఖ మహా నగరాభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) సిరిపురం జంక్షన్లో నిర్మించిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ భవనం(ది డెక్)లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటు కానుంది. నగర నడిబొడ్డున షిప్ డెక్ మోడల్లో ఐకానిక్ బిల్డింగ్లా అద్దాలతో నిర్మించిన ఈ నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది.
Minister Durgesh On RK Beach: గత ప్రభుత్వం నిర్లక్షం వలన బ్లూ ఫ్లాగ్ గుర్తింపుపై కొన్ని ఇబ్బందులు వచ్చాయని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. ఇప్పటికే పరిశుభ్రతపై 24 లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి నిర్ణయించడం జరిగిందని తెలిపారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రెండు, మూడు రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీ వ్యాప్తంగా విద్యుత్ శాఖలో 180 మందికి కారుణ్య నియామకాలు చేశామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. ఏపీలో విద్యుత్ కనెక్షన్ లేని గృహం ఉండకూడదని సీఎం చంద్రబాబు తనను ఆదేశించారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి సాధిస్తోందని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఉద్ఘాటించారు. రానున్న రోజుల్లో ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని ఎంపీ తేజస్వి సూర్య ధీమా వ్యక్తం చేశారు.
Cognizant: విశాఖపట్నంలో కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నామని కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తెలిపారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్లో 22 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నామని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.