Home » Visakhapatnam
కైలాసగిరి కొండపై ఏర్పాటు చేసిన గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జిని ఎంపీ భరత్ సోమవారం అధికారికంగా ప్రారంభించారు. ఎంపీ భరత్ సోమవారం అధికారికంగా బ్రిడ్జిని ప్రారంభించారు.
విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గానికి చెందిన అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్తూ జగన్ ఫోటోలు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. శబరి యాత్రలో రాజకీయ నేతల ఫోటోలపై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖపట్నంలో భూముల రీసర్వేలో వస్తున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించినట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర శాసనసభపక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్ రఘురామ కృష్ణరాజు తెలిపారు. రీసర్వేలో తమ కమిటీకి ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయని.. వీటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
రెండు ఎన్కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టంలో జాప్యం జరుగుతోంది. దీంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రి మార్చురీలోనే ఆ తొమ్మిది మృతదేహాలు ఉన్నాయి.
విశాఖలో ఘోరం జరిగింది. చిన్నారిని హత్య చేసిన దుండగులు.. శరీర భాగాలను కల్వర్టులో పడేసి వెళ్లారు.
పీఎం పాలెంలో మహిళా కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించారు పోలీసులు. ఒకే కేసులో నిందితులు బాధితులుగా.. బాధితులు నిందితులుగా మారినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కిడ్నాప్తో పాటు నకిలీ కరెన్సీ వ్యవహారం బయటకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ విశాఖపట్నంలో నిర్వహించిన రెండు రోజుల ప్రతిష్టాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నారు. అనేక దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మరో దశలోకి అడుగుపెడుతోందని మన్నవ మోహనకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు.
అధిక ధరలకు విద్యుత్ ఉత్పత్తి చేసి డేటా సెంటర్లకు సరఫరా చేస్తే వ్యయం ఎక్కువ అవుతోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వ్యయం పెరుగకుండా ఆధునిక టెక్నాలజీలపై సీఎం చంద్రబాబు ఆలోచన చేశారని.. ఈ క్రమంలోనే వాటిని నిజం చేస్తున్నారని వివరించారు. సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెజిలియన్స్ సెంటర్ అనేది విద్యుత్ వ్యవస్థల రక్షణకు పనిచేస్తుందని నొక్కిచెప్పారు.
తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాయలసీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశామని వివరించారు.
విశాఖపట్నంలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయి.