Home » Visakhapatnam
కొత్త ఏడాదికి ఘనంగా ఆహ్వానం పలకడానికి నగరవాసులు సిద్ధమవుతున్నారు. బుధవారం రాత్రి ప్రత్యేక వేడుకలు నిర్వహించేందుకు పలు స్టార్ హోటళ్లు, రిసార్టుల యాజమాన్యాలు ఏర్పాట్లు చేశాయి. తమ కార్యక్రమాలకు సినీ నటులు, గాయకులు, సెలబ్రిటీలను రప్పిస్తున్నాయి.
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా పలు ఆంక్షలు విధించినట్లు విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వేడుకలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని సూచించారు.
బీ 1, ఎమ్ 2 కంపార్ట్మెంట్లలో అగ్నిప్రమాదం జరిగినట్లు గుర్తించామనిఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. నర్సింగబల్లి వద్ద B1 ఏసీ బోగికి బ్రేక్లు పట్టేయడంతో మంటలు చెలరేగాయని అన్నారు.
చమట చుక్కకు ఓటమి లేదని.. ప్రస్తుతం పేదల శ్రమకు అన్యాయం జరుగుతోందని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కోసం సీఐటీయూ గొంతెత్తి పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం అవుతున్నాయని విమర్శించారు.
కైలాసగిరిపై ఉన్న టాయ్ రైలుకు ప్రమాదం తప్పింది. పర్యాటకులతో వెళ్తున్న రైలుకు బ్రేకులు ఫెయిల్ అయ్యింది. దీంతో రైలు వెనక్కి జారింది.
మంత్రి సంధ్యారాణి కుమారుడు, పీఏపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో అసలు నిజాలను పోలీసులు బయటపెట్టారు.
వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో వైసీపీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. వెంటనే తమ తప్పు తెలుసుకున్న వీఎంఆర్డీఏ అధికారులు వైసీపీ కార్యక్రమానికి అనుమతి రద్దు చేశారు.
స్వచ్ఛాంధ్రలో అనకాపల్లి 13వ స్థానంలో ఉందని.. ఇంకా మెరుగుపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుండి నడిపించేది గ్రీన్ సోల్జర్లని.. వారికి అభివాదాలు తెలియజేశారు.
విశాఖలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెందుర్తి సింహపురి కాలనీ బీఆర్టీఎస్ రోడ్డులో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్రవాహనంపై భార్య, కుమారుడితో వెళ్తున్న ఓ వ్యక్తి.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి డివైడర్ను బలంగా ఢీకొట్టాడు.
హిందూ దేవాలయాలపై జగన్కు ఎందుకు ఇంత ద్వేషమని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు. హిందువులకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.