Home » Visakhapatnam
Gold and Silver Rates Today: బంగారం ధరలు(Gold Price) భయపెట్టేస్తున్నాయి.. అమాంతం పెరిగిపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 10 వేలు పెరిగి బెంబేలెత్తించింది. అయితే, రెండు మూడు రోజుల నుంచి బంగారం(Gold) ధర కాస్త అటూ ఇటూగా తగ్గుముఖం పడుతోంది.
కాంగ్రెస్ ఐడియాగా చెబుతున్న 'సంపద పునఃపంపిణీ' వివాదం వేడెక్కుతున్న తరుణంలో ఆ పార్టీపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరో బాంబు వేశారు. 'మతఆధారిత జనగణన' కు సిఫారసు చేయడం ద్వారా దేశ సాయుధ బలగాల్లో చీలికకు కేంద్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రయత్నించాయని అన్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్మోహన్రెడ్డి గత ఇరవై రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం జగన్ నగరంలో వేపగుంట జంక్షన్ నుంచి పీఎం పాలెం వరకూ రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన..
అభివృద్ధికి అవకాశాలున్నా.. పాలకులు నిర్లక్ష్యంతో ఇంకా వెనుకబడి ఉన్న నియోజకవర్గాల్లో పెందుర్తి ఒకటి. విశాఖపట్టణం నగరపాలక సంస్థ పరిధిలో ఉండే పెందుర్తి వాణిజ్య కేంద్రాలు అధికంగా ఉన్న ప్రాంతం. విశాఖపట్టణం (Visakhapatnam)మహానగరానికి సమీపంలో ఉన్నప్పటికి ఈ నియోజకవర్గం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఈ నియోజకవర్గంలో పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలతో పాటు పెదగంట్యాడ మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి.
పెందుర్తి(Pendurthi) వైసీపీ(YCP) అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్(MLA Annam Reddy) క్యాంపు/పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధికారులు భారీగా చీరలు, కీచైన్లు, టోపీలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన చీరల విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ‘సీ’ విజిల్లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు..
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మాట ఇస్తే... మాట తప్పరు, మడమ తిప్పరని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖను పరిపాలన రాజధాని చేస్తానని సీఎం జగన్ అన్నారని.. మళ్ళీ గెలిచిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ చెప్పారని తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించామని.. పెట్టుబడులు వచ్చాయన్నారు.
విశాఖ: ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. విశాఖ మధురవాడ టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆధ్వర్యంలో 300 మంది పసుపు కండువాలు కప్పుకున్నారు.
బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా ముందు పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అదే కొంత ఉన్నత వర్గాలకు, ధనిక కుటుంబాలకు చెందిన వారైతే..
Andhrapradesh: గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. అలాగే రేపు విశాఖలో నామినేషన్లు వేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రలో 30 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే... తాను సీఎం అవుతానన్నారు. విశాఖను వాషింగ్టన్ డీసీగా..ఆంధ్రను అమెరికా చేసే సత్తా తనకుందని చెప్పుకొచ్చారు. మూడు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు.
అమరావతి: ఏపీలో ఎన్నికలు అయ్యేలోగానే విశాఖ స్టీల్ ప్లాంట్ను మూసివేసేదిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈసారి చేతికి మట్టి అంటకుండా భారీ స్థాయిలో కుట్ర చేస్తున్నారు. విశాఖ ఉక్కును ఆనుకూని ప్రభుత్వం నిర్వహించిన గంగవరం పోర్టును ఆదాని గ్రూప్ పూర్తిగా హస్తగతం చేసుకుంది.